విజయమ్మతో రోజా భేటీ ! జగన్‌కు చెప్పే వచ్చారా ?

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మితో సమావేశం అయ్యారు. ఇటీవల వైసీపీలో జరిగిన పరిణామాలతో ఎవరూ విజయమ్మతో భేటీకి ఆసక్తి చూపించడం లేదు. కొత్త మంత్రులెవరూ ఆమె పేరును కూడా తల్చుకోలేదు. కొత్తగా మంత్రులైన వారు ఎవరూ విజయమ్మతో భేటీకి ప్రయత్నించలేదు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు అని గుర్తుంచుకోలేదు. కానీ రోజా మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకుని మరీ హైదరాబాద్ వెళ్లి సమావేశం అయ్యారు. ఈ అంశం వైఎస్ఆర్‌సీపీలోనూ హాట్ టాపిక్ అవుతోంది.

హైదరాబాద్ లోటస్ పాండ్‌లో ఉన్న షర్మిల నివాసంలో ఈ సమావేశం జరిగింది. తనకు మంత్రి పదవి లభించిన సందర్భంగా విజయమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కొంత కాలంగా రోజా ప్రయత్నిస్తున్నారని ఇప్పటికి కుదిరిందని రోజా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి ప్రత్యేక రాజకీయ విశేషం ఏమీ లేదంటున్నారు. ఇటీవలి కాలంలో వైఎస్ విజయలక్ష్మి హైదరాబాద్‌, బెంగళూరుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు.

విజయమ్మతో రోజా భేటీ దాదాపుగా గంట పాటు సాగినట్లుగా తెలుస్తోంది. వీరి మధ్య రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు తెలంగాణలో షర్మిల పాదయాత్రకు వస్తున్న స్పందనరపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. రోజా తాను విజయమ్మతో భేటీకి వెళ్తున్నానని జగన్‌కు చెప్పి ఉండరని.. అలా చెప్పినట్లయితే ఆయన వద్దనే వారని అంటున్నారు. అందుకే ఎవరూ కలవలేదంటున్నారు. ఇప్పుడు జగన్ అనుమతి లేకుండా రోజా కలిసి ఉన్నట్లయితే… అది భవిష్యత్‌లో రోజాకు సమస్యలు సృష్టిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close