ఆర్కే పలుకు : వారంలోనే “కొత్తపలుకు” మార్చేసిన ఆర్కే !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో పలికే “కొత్తపలుకు” ఒక్కో సారి సిల్లీగా అనిపిస్తూంటుంది. చాలా సార్లు అవును నిజమే కదా అని అనిపిస్తుంది. ఈ వారం అటు కేటీఆర్ ఇటు జగన్ విషయంలో చేసిన విశ్లేషణలు రెండూ సిల్లీగానే అనిపిస్తాయి. ఇలా కూడా చేస్తారా ? గత అనుభవాలు కళ్ల ముందు ఉన్నా.. ఇలా చేస్తారా అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కేసీఆర్ బీఆర్ఎస్ ఆలోచన చేయడానికి కారణం తెలంగాణలో గెలుపుకోమని ఆర్కే విశ్లేషించారు . ఎలా అంటే తనపై వ్యతిరేకత ఉంది కాబట్టి.. దాన్ని భిన్న మార్గంలో అభిమానంగా మల్చుకోవడానికి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది తానేనని ప్రజల్లో ముద్ర వేసుకోవడానికి.. మోదీకి ఎదురు నిలబడే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుని తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందడానికి ఈ బీఆర్ఎస్ స్కెచ్ వేశారట. ఇదంతా ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో నడుస్తోంది. గతంలో ఏపీలో జగన్‌ను.. గెలిపించిన వ్యూహమే అమలు చేస్తున్నారంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలు భిన్నంగా ఆలోచిస్తారని గత వారం ఇదే ఆర్కే రాసుకొచ్చారు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల పేరుతో తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇది ప్రజల్ని ఆగ్రహానికి గురి చేస్తోందన్నారు. గత వారం ఆగ్రహానికి గురి చేసేది.. ఈ వారం ఉండవల్లి లాంటి వాళ్లతో పొడిగించుకున్నంత మాత్రాన ప్లస్ ఎలా అవుతుందో ఆర్కే కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయారు. ఇంకా చాలా మందితో సమావేశాలు పెట్టి కేసీఆర్ వీరుడు, శూరుడు అని పొగిడించుకోబోతున్నారని కూడా ఆర్కే చెబుతున్నారు. దాదాపుగా పదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం ప్రజా తీర్పుకు వెళ్తే ప్రజలు.. ఇతరులు చేసే పొగడ్తలతో చూసి ఓటేస్తారా ? పదేళ్ల పాలనను చూసి ఓటేస్తారా ? అనేది ఆర్కే లాజిక్ గా ఆలోచించుకోలేకపోయారనుకోవచ్చు.

ఇక ఏపీ విషయానికి వస్తే ఆర్కే కూడా పవన్ కల్యాణ్ లా గందరగోళంగా ఉన్నారు. గత వారమే జగన్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నందున మెల్లగా జగన్‌కు బీజేపీ దూరం జరుగుతోందని చెప్పుకొచ్చారు. కానీ ఈ వారం కొత్తపలుకు మాత్రం భిన్నంగా ఉంది. చంద్రబాబు వల్ల బీజేపీకి వచ్చే లాభమేం లేదు కనుక .. పరోక్షంగా అయినా జగన్‌నే సీఎంగా కొనసాగేలా చూడాలనుకుంటోందట. అదే ఇష్టమని.. పవన్‌కూ చెప్పిందట. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంలో బీజేపీ ఉందట. మరి జగన్‌పై పెరుగుతున్న ప్రజావ్యతిరేకత విషయంలో బీజేపీ ఎందుకు మనసు మార్చుకుందనే విషయాన్ని ఆర్కే చెప్పలేకపోయారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ.. వచ్చే ఎన్నికల్లో పొత్తులు టీడీపీ, జనసేన మధ్య ఉంటే చాలని.. బీజేపీ అక్కర్లేదన్న సందేశాన్ని ఈ వారం ఆర్కే పంపారు. నిన్నటి వరకూ ఇది వేరేగా ఉండేది. బీజేపీ కూడా పొత్తులో ఉంటే.. ఎన్నికల విషయంలో జగన్ చేసే అధికార దుర్వినియోగాన్ని అడ్డుకట్టు వేయవచ్చని ఆయన చెప్పేవారు.

ఆర్కే కొత్తపలుకుల్లో మార్పు సహజంగానే ఉంటుంది కానీ ఇలా ఒక్క వారంలోనే పూర్తి స్థాయిలో మార్పు రావడానికి కారణం ఏమిటన్నది మాత్రం ఆసక్తికరమే. టీడీపీ రాజకీయ వ్యూహాల్లో ఆయన ఇంకా భాగం పంచుకుంటున్నారో.. లేక తన సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారో కానీ… అసువుగా మాట మార్చేస్తున్నారు. కొత్తపలుకుకు విలువ తగ్గించేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close