ఆర్కే పలుకు : దమ్ముంటే అరెస్ట్ చేస్కో..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని.. పగతో రగిలిపోయే ప్రభుత్వ పెద్దలను మరింత రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన వారంతపు ఆర్టికల్ కొత్తపలుకులో ఈ సారి మరింత ఘాటు పెంచారు. దీనికి కారణం… రఘురామకృష్ణరాజు ప్రెస్‌మీట్‌లు ప్రసారం చేసినందుకు తన చానల్‌పైనా రాజద్రోహం కేసు పెట్టడం ఓ కారణం అయితే… ప్రభుత్వ వైద్యులు రఘురామకృష్ణరాజు గాయాల విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చినట్లుగా ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ప్రకటించుకోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.

రఘురామకృష్ణరాజుతో పాటు టీవీ5, ఏబీఎన్‌లపైనా సీఐడీ పోలీసులు సుమోటోగా రాజద్రోహం కేసులు పెట్టారు. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసినప్పుడే… మరో రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మీడియా ప్రతినిధుల్ని అరెస్టులు చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో కానీ ఆ సీఐడీ బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి.ఆ తర్వాత రఘురామ రాజు కేసులో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ..ఆ కేసు విషయంలో ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రఘురామరాజు విషయంలో సీఐడీ సునీల్ అత్యుత్సాహం.. పోలీసులు కొట్టిన మాట నిజమని అంతర్గతంగా కూడా అందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఇరుక్కుపోయిందన్న భావనలో రాధాకృష్ణ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

రఘురామకృష్ణరాజు విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి చేసి తప్పుడు నివేదిక ఇప్పించారనే అంశంపై తన వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని… ప్రభుత్వం కేసు పెట్టే ధైర్యం చేస్తుందా అని సవాల్ చేశారు. తన ఆర్టికల్‌లో ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు.. ప్రధానంగా… అందరికీ… తప్పుడు నివేదికకు ఆధారాలు అన్న కోణంలోనే ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అందరూ నిండా మునిగిపోయారన్న భావన రాజకీయవర్గాలలో ఉంది. ఇంకా ముందుకు వెళ్తే..వారిని మరింతగా ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆర్కే… ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మీడియా తీరునూ ఆర్కేతప్పు పట్టారు. రఘురామరాజుకు బెయిల్ వార్తను సరిగ్గా ఇవ్వలేదని ఆక్షేపించారు. అయితే అదే్ విషయంలో… ఆయన చానల్‌… పత్రికపైనా కొన్ని విమర్శలు ఉన్నాయి. అయితే ప్రజలకు ఏది ఆసక్తికరంగా ఉంటుందో ఆ వార్తలు ఇస్తేనే వాటికి మనుగడ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి గులాములు కొట్టకుండా..ప్రజల తరపునప్రతిపక్షంగా వ్యవహరిస్తేనే మీడియాకు ఆదరణ ఉంటుంది. ఆర్కే చేసిన సవాళ్లను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటే… ఆయనను రేపోమాపో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close