విషాదం… పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే దారుణం జరిగిపోయింది.పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

అరవింద్ ట్రావెల్స్ కు చెందినా బస్సు పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండగా అనుకోని విధంగా ప్రమాదానికి గురైంది. చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో బస్సును ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ఆరుగురు సజీవ సహనం అయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సులో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలు ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నింపింది. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. తెల్లారితే తమ కుటుంబీకులు హైదరాబాద్ చేరుకుంటారనుకుంటే ఇలా బస్సు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close