మర్యాద దక్కడం లేదని రోజా కన్నీరు..!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు అధికార మర్యాదలు అంటే ప్రోటోకాల్ దక్కడం లేదని అదే పనిగా కన్నీరు పెట్టుకున్న రోజాకు..సొంత ప్రభుత్వంలోనూ అదే డ్యూటీ తప్పడం లేదు. తాజాగా ఆమె మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన శాసనసభ ప్రివిలైజ్ కమిటీ సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన నియోజకవర్గంలో ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని.. తనకు కనీస సమాచారం కూడా రావడం లేదని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె ఏడ్చారు. టీటీడీలో కూడా తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా.. పట్టించుకోవడం లేదంటూ ఒక్క సారిగా బ్లాస్ట్ అయి బోరున విలపించారు.

రోజా ఒక్క సారిగా ఏడవడంతో కమిటీ సభ్యులు కూడా స్టన్ అయ్యారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడడం తమ బాధ్యతని చెప్పి సర్ది చెప్పారు. రోజా నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గమే ఎక్కువ. మంత్రి పదవికి ఎక్కడ పోటీ వస్తుందో అన్న ఉద్దేశంతో ఆమెను నియోజకవర్గంలో బలహీనం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అధికారిక కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం వెళ్లడం తక్కువే. అంతే కాదు.. ఆమె ను వ్యతిరేకించే వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రతీ గ్రామంలోనూ పెద్దిరెడ్డి వర్గం ఉంది.

దీంతో.. రోజా నగరిలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. చివరికి అది.. ఏడుపు రూపంలో బయటకు వచ్చిందని భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… కూడా ఆమె అసెంబ్లీ ప్రవిలేజ్ కమిటీ సమావేశాల్లో ఏడిచారు. అప్పుడు.. ఆమె అసభ్యంగా మాట్లాడినందుకు వేటేశారు. వాటిపై వివరణ ఇచ్చేందుకు వచ్చి విలపించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి… ప్రోటోకాల్ కోసం కన్నీరు పెట్టాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close