రోజా వర్సెస్ అచ్చెన్న రాజీనామాల సవాళ్లు !

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజకీయ సవాళ్లు విసురుకున్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని ఒకరిని ఒకరి ప్రతి సవాల్ చేసుకున్నారు. వీరి సవాళ్లు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల తమ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు వస్తాయన్నారు. ఇది రోజాకు నచ్చలేదు. మహిళా దినోత్సవంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు, లోకేష్ తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు రావన్నారు. ఇప్పుడున్నఇరవై మూడు సీట్లు కూడా నిలబెట్టుకోలేరని విమర్శించారు.

అంతటితో ఆగలేదు..అచ్చెన్నాయుడుపై బాడీషేమింగ్ విమర్శలు చేశారు. గట్టి చట్నీ గట్టిగా తింటే అచ్చెన్నాయుడు 160 కిలోలు పెరుగుతారేమోగానీ. ఇప్పుడున్న 23 సీట్లు రావడం కూడా కష్టమని నీకు సరదాగా ఉంటే టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు రా.. అంటూ సవాల్‌ చేశారు. రోజా విమర్శలపై అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. నగరిలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అక్కడ టీడీపీ ఓడిపోతే.. సాధారణ ఎన్నికల్లో అక్కడ పోటీపెట్టబోమన్నారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు తల కిందుల తపస్సు చేసినా 160 సీట్లు రావంటున్నారని .. రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు.. నగరిలో టీడీపీ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాల్లో మేం పోటీ చేయబోమని ప్రకటించారు అచ్చెన్నాయుడు.. సింపతీ కోసం కోడి కత్తి డ్రామా ఆడారు.. అయినా దాని వల్ల సింపతీ రాలేదని.. మరింత సింపతీ కోసం తన బాబాయిని చంపేసినా పట్టించుకోని వ్యక్తి జగన్ అని ఆరోపించారు. 151 సీట్లు వచ్చినా.. అతి తక్కువ కాలంలో సీఎం వైఎస్‌ జగన్‌ విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారని విమర్శించారు. అచ్చెన్న సవాల్‌పైరోజా ఎలా స్పందిస్తుందో మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close