ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్ ఏమిటంటే..

ఇటీవల హైద‌రాబాద్ లో ‘రుస్లాన్’ అనే సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్లు జ‌రిగాయి. ఈవెంట్‌లో చిత్ర‌బృందం, సెల‌బ్రెటీలూ ఉన్నారు కానీ, ఫ్యాన్స్ లేరు. వాళ్లు లేక‌పోతే మ‌జా ఏం ఉంటుంది? అందుక‌నే అప్ప‌టిక‌ప్పుడు ఈవెంట్ కంపెనీ, కృష్ణా న‌గ‌ర్ నుంచి వంద‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల్ని దిగుమ‌తి చేయించింది. ఈవెంట్ కి వ‌స్తే రూ.1000 ఇస్తామ‌న్న‌ది ఒప్పందం. దాంతో జూనియ‌ర్ ఆర్టిస్టులు హుషారుగా ఈవెంట్ కు వ‌చ్చారు. కార్య‌క్ర‌మం అయిపోయింది. కానీ పేమెంట్లు ఆగిపోయాయి. ఇస్తామ‌న్న డ‌బ్బులు ఏవి? అని అడిగితే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ చేతులు ఎత్తేసింది. నిర్మాత‌ల‌కు అస‌లు ఈ విష‌య‌మే తెలీదు. దాంతో గొడ‌వ మొద‌లైంది. ఇప్పుడు ఆ జూనియ‌ర్ ఆర్టిస్టులు పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కారు. త‌మ‌కు రావాల్సిన మొత్తం ఇచ్చేలా చూడ‌మ‌ని స్థానిక ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్‌ పోలీసుల‌కు మొర పెట్టుకొన్నారు. ఈవెంట్ కంపెనీతో పాటు, నిర్మాత కె.కె.రాధామోహ‌న్ పైనా ఫిర్యాదు చేశారు. నిజానికి అస‌లు ఈ వ్య‌వ‌హారం ఏమిటన్న‌ది నిర్మాత‌కీ తెలీదు. కేవ‌లం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తీసుకొన్న ఓ త‌ప్పుడు నిర్ణ‌యం వ‌ల్ల నిర్మాత‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. రేపో, మాపో.. ఈ బాధితులంతా మీడియా ముందుకు వ‌చ్చి, త‌మ గోడును వెల్ల‌బుచ్చుకొంటార‌ని స‌మాచారం. బ‌డాస్టార్ ఈవెంట్ల‌కు ఫ్యాన్స్‌ని స‌ర‌ఫ‌రా చేయ‌డం మామూలే. అయితే ఎక్క‌డా ఇలాంటి పేచీ జ‌ర‌గ‌లేదు. ఇలాంటి ఓ ఇష్యూ బ‌య‌ట‌కు రావ‌డం ఇదే తొలిసారి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close