మాజీ మంత్రి శైలజానాద్ వైకాపాలోకి జంప్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కడే ఎంతగా చెమటోడ్చుతున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు పైగా నెలకొకరు చొప్పున పార్టీని వీడి వేరే పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. త్వరలో మాజీ మంత్రి ఎస్.శైలజానాద్ పార్టీని వీడి వైకాపాలోకి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన తెదేపాలోకి వెళదామని ప్రయత్నించారు కానీ వీలుపడకపోవడంతో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి సుమారు ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడకపోవడంతో శైలజనాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో అటువంటి బలమయిన నాయకుడి కోసం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయనను వైకాపాలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా నుండి కూడా ముగ్గురు కాంగ్రెస్ నేతలు వైకాపాలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో మధ్యవర్తుల ద్వారా చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close