సజ్జల ఏపీ బీజేపీలో ఆ ఇద్దరు ఎంపీల్నే చూస్తున్నారు !

బీజేపీ ప్రజాగ్రహ సభ పెట్టి బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకు వెళ్తారని డైరక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇది సహజంగానే ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే బెయిల్‌పై ఉన్న నేత.. తరచూ బెయిల్ క్యాన్సిల్‌పై చర్చ జరిగే నేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. అందుకే వైసీపీలోనూ ఉలికిపాటు కనిపిస్తోంది. కానీ దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక.., బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ ఎంపీల్ని టార్గెట్ చేసి.. సరి పుచ్చుకుంటున్నారు. తమ ఇగోను శాటిస్ ఫై చేసుకుంటున్నారు. ప్రజాగ్రహసభలో ప్రకాష్ జవదేకర్ చేసిన హెచ్చరికలు.., విమర్శలపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట మాత్రంగా కూడా స్పందించలేదు.

కానీ ఏపీ బీజేపీని ఇద్దరు టీడీపీ మాజీఎంపీల ద్వారా చంద్రబాబు నడుపుతున్నారని విమర్శలు గుప్పించారు. నిజానికి అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చి వెళ్లినప్పటి నుండి సోము వీర్రాజు వెనక్కి తగ్గిపోయారు. వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే బ్యాచ్ ముందుకు వచ్చింది. దీంతో వైసీపీ పెద్దలతో ఏదో తేడా కనిపిస్తోంది. అలా అని బీజేపీపై నేరుగా ఎటాక్ చేయలేని పరిస్థితి. అందుకే కేంద్రంతో సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని ఏపీ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబు డైరక్షన్‌లో ఉన్నారని ఆరోపణలు చేస్తూ కవర్ చేసుకుంటున్నారు.

కానీ మారుతున్నరాజకీయ పరిస్థితి మాత్రం వైసీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితిని మరింత దిగజార్చుకోకుండా.. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. సీనియర్… ఢిల్లీ స్థాయి నేతలెవర్నీ విమర్శించడం లేదు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల్ని మాత్రం విమర్శించి సరి పెడుతున్నారు. ఈ విధానం ఎంత కాలం వర్కవుట్ అవుతుందో కానీ బీజేపీ హైకమాండ్ తీరు మాత్రం వైసీపీ విషయంలో మారిపోయిందన్న అభిప్రాయం ఆ పార్టీలోనూ గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close