విజయవాడ జైల్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అన్న, ధనుంజయ్ రెడ్డి అన్నలను పరామర్శించేందుకు జగన్ రెడ్డికి తీరిక దొరకలేదు. ఆ ఇద్దరూ తన నిర్వాకాల కారణంగానే జైలు పాలైనప్పటికీ జైలుకెళ్లి వారికి ధైర్యం చెప్పడం తన స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా ఫీలయ్యారు. అందుకే వారి స్థాయికి సరిపోతారని సజ్జల రామకృష్ణారెడ్డిని, అప్పిరెడ్డిని పంపించారు. వీరిద్దరూ జిల్లా జైలుకు వెళ్లి .. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలతో మాట్లాడారు. జైల్లో పెట్టినందున పరువు పోలేదని జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నా..సీఎం అయ్యారని బాధపడవద్దని చెప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది.
వల్లభనేని వంశీని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ జైలుకు వెళ్లి పరామర్శించారు. వారు చేసిన నేరాలోత వాళ్లు జైలుకెళ్లారు. కానీ ఈ ఇద్దరు జగన్ స్వయం ప్రకటిత అన్నలు మాత్రం.. తమకు దేవుడిచ్చిన తమ్ముడు అయిన జగన్ రెడ్డి కోసం చేసిన నేరాలకు జైలుకెళ్లారు. ఆయన కోసం డబ్బులు మనీలాండరింగ్ చేసి దొరికిపోయారు. అయిన వారు ఇంకా తాను పరామర్శించే స్థాయికి రాలేదని.. వారికి సజ్జలే ఎక్కువ అని జగన్ లైట్ తీసుకున్నారు.
ఇక జగన్ కోసం చేసిన నిర్వాకాల కారణంగా అరెస్టు అయి జైలులో మగ్గిపోతున్న సస్పెండెడ్ ఐపీఎస్ అధికారిక సీతారామాంజనేయులు,,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు కూడా జైల్లో ఉన్నారు. వారిని పనిలో పనిగా పరామర్శించారో లేదో స్పష్టత లేదు. రాజ్ కెసిరెడ్డిని మాత్రం ఈడీ అదుపుకోకి తీసుకుని స్టేట్ మెంట్ రికార్డు చేస్తోంది. ఈ కారణంగా సజ్జల , అప్పటి రాజ్ కెసిరెడ్డితో మాట్లాడే అవకాశాలు లేవని భావిస్తున్నారు.