రప్పా రప్పా నరికేస్తాం అని జగన్ రెడ్డి ముందు కారు ఎక్కి మరీ పోస్టర్ ప్రదర్శించే అవకాశం ఇచ్చిన యువకుడ్ని టీడీపీ ఖాతాలో వేసేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇన్సూరెన్స్ కోసం టీడీపీ సభ్యత్వం తీసుకున్నది నిజమే కానీ.. అతను జగన్ రెడ్డి అంటే కోసుకుంటాడని అందరికీ తెలుసు. అందుకే ఆయనను బలి చేసేందుకు ప్రత్యేకంగా పోస్టర్ చేతికిచ్చి పంపించారు. ఇప్పుడు పోలీస్ కేసు అయ్యే సరికి టీడీపీ వాడే పట్టుకున్నాడు.. మాకు సంబంధం ఏమిటంటున్నారు.
చంద్రబాబు చేయించి ఎదుటి వారి మీద వేయడం ఆయన అలవాటేనని ఏ మాత్రం సిగ్గులేకుండా సజ్జల చెబుతున్నారు. ఓ వైపు ఆ వైసీపీ కార్యకర్త జైలుకెళ్తే.. కనీసం లాయర్ ను కూడా ఏర్పాటు చేయలేదు. అలా గాలికి వదిలేసి..అతన్ని టీడీపీ ఖాతాలో వేసేస్తున్నారు. సజ్జలతో పాటు జగన్ రెడ్డి వ్యవహారశైలి చూసి వైసీపీ క్యాడర్ కు సిగ్గు రావాల్సి ఉంది. చేయాల్సిన తప్పులు అన్నీ చేయించేసి.. మాకు సంబంధం లేదు.. వాళ్లు టీడీపీ కార్యకర్తలే అని పట్టించుకోవండ మానేస్తారు.
ఇప్పటికే సొంత తల్లి, చెల్లి మీద కూడా టీడీపీ ముద్ర వేశారు. సొంత సోదరి మీద పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి పోయిందని జగన్ రెడ్డి ఘోరమైన మాటలు మాట్లాడారు . అలాంటి వారికి కనీసం తమ వాళ్లను పట్టించుకునే.. కనీసం బలి చేయకుండా కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. కోడికత్తి శీను జగన్ రెడ్డి సపోర్టర్ అని తెలిసి కూడా.. ఆయన జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు పోస్టర్ చేతికిచ్చి రవితేజ అనే వ్యక్తి బతుకు బుగ్గిపాలు చేసి..మాకు సంబంధం లేదు.. టీడీపీ కార్యకర్త అంటున్నారు. ఇలాంటి వాళ్లు పార్టీని నడిపితే క్యాడర్ కు ఆ గతి పట్టాల్సిందే.