మ‌హేష్ లేకుండానే ‘పాట‌’ పాడేస్తారు

క‌రోనా భ‌యాల‌తో హీరోలు సెట్లోకి అడుగుపెట్ట‌డానికి కాస్త ఆలోచిస్తున్నారు. కొంత‌మంది హీరోలైతే.. `ఇప్ప‌ట్లో షూటింగుల‌కు రాలేం` అని ముందే చెప్పేస్తున్నారు తాజాగా మ‌హేష్ బాబు కూడా అక్టోబ‌రు వ‌ర‌కూ షూటింగుల‌కు రాలేడ‌ని తెలుస్తోంది. అయితే ఈలోగా త‌న కొత్త సినిమా `స‌ర్కారు వారి పాట‌` మాత్రం మొద‌లైపోతుంది. ఆగ‌స్టులో `స‌ర్కార్‌…` సెట్స్‌పైకి వెళ్తుంది. మొదటి షెడ్యూల్ లో మ‌హేష్ లేని స‌న్నివేశాల్ని చ‌క చ‌క పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ భావిస్తున్నాడు. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీల‌క‌మైన సెట్స్ వేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అందులోనే ఎక్కువ భాగం షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. అక్టోబ‌రులో మ‌హేష్ సెట్స్ లోకి అడుగ‌పెట్టే ఛాన్సుంది. హీరోయిన్ కూడా దాదాపుగా అ స‌మ‌యంలోనే రంగ ప్ర‌వేశం చేస్తుంది. ఈలోగా.. మిగిలిన సన్నివేశాలు, సెట్స్ ప‌నులు పూర్తవుతాయి. మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా కైరా అద్వాణీ, మంజ్రేక‌ర్ (ద‌బాంగ్ 3 ఫేమ్‌) పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇప్పుడు మ‌హేష్ తండ్రి పాత్ర కోసం అన్వేష‌ణ మొద‌లైంది. అందులో ఓపేరున్న న‌టుడు క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. అవ‌స‌ర‌మైతే బాలీవుడ్ న‌టుడ్ని తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close