మ‌హేష్ లేకుండానే ‘పాట‌’ పాడేస్తారు

క‌రోనా భ‌యాల‌తో హీరోలు సెట్లోకి అడుగుపెట్ట‌డానికి కాస్త ఆలోచిస్తున్నారు. కొంత‌మంది హీరోలైతే.. `ఇప్ప‌ట్లో షూటింగుల‌కు రాలేం` అని ముందే చెప్పేస్తున్నారు తాజాగా మ‌హేష్ బాబు కూడా అక్టోబ‌రు వ‌ర‌కూ షూటింగుల‌కు రాలేడ‌ని తెలుస్తోంది. అయితే ఈలోగా త‌న కొత్త సినిమా `స‌ర్కారు వారి పాట‌` మాత్రం మొద‌లైపోతుంది. ఆగ‌స్టులో `స‌ర్కార్‌…` సెట్స్‌పైకి వెళ్తుంది. మొదటి షెడ్యూల్ లో మ‌హేష్ లేని స‌న్నివేశాల్ని చ‌క చ‌క పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ భావిస్తున్నాడు. హైద‌రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీల‌క‌మైన సెట్స్ వేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అందులోనే ఎక్కువ భాగం షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. అక్టోబ‌రులో మ‌హేష్ సెట్స్ లోకి అడుగ‌పెట్టే ఛాన్సుంది. హీరోయిన్ కూడా దాదాపుగా అ స‌మ‌యంలోనే రంగ ప్ర‌వేశం చేస్తుంది. ఈలోగా.. మిగిలిన సన్నివేశాలు, సెట్స్ ప‌నులు పూర్తవుతాయి. మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా కైరా అద్వాణీ, మంజ్రేక‌ర్ (ద‌బాంగ్ 3 ఫేమ్‌) పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇప్పుడు మ‌హేష్ తండ్రి పాత్ర కోసం అన్వేష‌ణ మొద‌లైంది. అందులో ఓపేరున్న న‌టుడు క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. అవ‌స‌ర‌మైతే బాలీవుడ్ న‌టుడ్ని తీసుకురావాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close