మీడియా వాచ్ : వాలంటీర్లు కొనడం ఆపేస్తే పాతాళంలోకి సాక్షి సర్క్యులేషన్ !

సాక్షి పత్రికను కొనాలని వాలంటీర్లకు ప్రతీ నెలా రూ.రెండువందలు అదనంగా ఇస్తూ జారీ చేసిన జీవో ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ పేరుతో వాలంటీర్లకు ఇస్తున్నడబ్బులన్నీ అక్రమమే. ఆ డబ్బులన్నీ సాక్షి పత్రిక యాజమాన్యానికే చేరుతున్నాయి. రెండున్నర లక్షల మంది వాలంటీర్లు.. రెండు న్నర లక్షల కాపీల్ని కొంటున్నారంటే మామూలు విషయం కాదు.

ప్రజాధనంతో పేపర్లు కొనిపించి సర్క్యులేషన్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈనాడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించంది. ఈ క్రమంలో ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్… తాజాగా గణాంకాల్లోనూ ఈనాడే ముందు ఉందని సాక్షి వెనుక ఉందని తెలిపింది. అంటే ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా సాక్షి పత్రిక ఈనాడు దరి దాపుల్లోకి కూడా రావడం లేదు. ఏపీలో సాక్షి దినపత్రికను కొనేవారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటోంది.

ప్రజాధనంతోనే లక్షల కాపీల్ని కొంటున్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చి మరీపేపర్ కొనిపించారు. అలాగే ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపిస్తున్నారు. యూనివర్శిటీలు సహా ఇతర చోట్ల.. బలవంతంగా పేపర్ అంట కడుతున్నారు. ఇంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యూలేషన్ … ఏపీలో ఐదారు లక్షల లోపే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే డబ్బులు పెట్టే కొనే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు పూర్తిగా అడుగంటి పోయారని స్పష్టమవుతోంది.

ఖచ్చితంగా ఏపీలో సాక్షికి డబ్బులు పెట్టి కొనే చందాదారులు లక్ష నుంచి రెండు లక్షలు లోపే ఉంటారని భావిస్తున్నారు. ఇంత చేసినా సాక్షి పేపర్ మెరుగుపడకపోవడంతో ప్రభుత్వం మారితే కప్పకూలిపోతుందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు సర్క్యూలేషన్ లేకపోయినా వందల కోట్ల ప్రజాధనం .. ఆ పత్రికకు కట్టబెడుతున్నారు. మొత్తంగా ఈనాడు … కరోనా అనంతర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడుతోంది కానీ.. సాక్షి పునాదులు కదిలిపోయాయని… అప్పనంగా దొరకిన అధికారంతో ప్రజాసొమ్ముతో నిలబెడుతున్నారు. అధికారం పోయిన మరుక్షణం సాక్షి దోచిన ప్రజాధనం కక్కించకుండా ఉండరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close