మీడియా వాచ్ : నేరుగా న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేస్తున్న సాక్షి

తాము చెప్పిందే తీర్పు.. పెట్టిందే షరతు అన్నట్లుగా వ్యవహరిస్తున్న సాక్షి … హైకోర్టును సైతం బ్లాక్ మెయిల్ చేసేందుకు రంగంలోకి దిగింది. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన తర్వాత… సర్టిపైడ్ కాపీ రావడానికి ఓ కీలక ఉద్యోగి సహకరించారంటూ ఆయనపై నిందలేశారు. ఈ కాపీ ఇచ్చేది స్వయంగా రిజిస్ట్రార్ మాత్రమే. ఆయన జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉంటారు. ఆయనపై సాక్షి నిందలేసింది. తాము చెప్పినట్లుగా చేయకపోతే మరకలు పూస్తామని హెచ్చరికలు పంపింది.

సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి వారం పడుతుందని గంటల్లోనే ఇచ్చేశారని సాక్షి అభియోగం. నిజానికి ఆ కాపీ తీసుకుంది ప్రభుత్వ న్యాయవాది. చంద్రబాబు బయటకు వచ్చినా జైలులోనే ఉన్నట్లుగా కదలకుండా చేయాలని.. షరతులు విధించేలా చూసుకునేందుకు వెంటనే లంచ్ మోషన్ దాఖలుచేసేందుకు సర్టిఫైడ్ కాపీకి దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే తీసుకున్నారు. ఇలా ఎవరు దరఖాస్తు చేసినా రెండు వర్గాలకూ సర్టిఫైడ్ కాపీ ఇస్తారు.

నిజానికి బెయిల్ మీద బయటకు రావడనికి సర్టిఫైడ్ కాపీ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు బెయిల్ తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత ష్యూరిటీలు సమర్పిస్తే సరిపోతుంది. కానీ హైకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా ఏదో జరుగుతోందని ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి న్యాయవ్యవస్థపై నిందలు వేయడానికి.. సాక్షి బరి తెగించింది. అయితే మేనేజ్ చేయడం లేకపోతే… బ్లాక్ మెయిల్ చేయడం జగన్ రెడ్డి వ్యూహం. గతంలో ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు హైకోర్టు మీద పడ్డారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకపోతే….. గుడ్డ కాల్చి మీద వేసి వ్యవస్థల్ని కూడా తమతో సమానం చేసేసుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close