ఉద్యోగుల పట్ల “సాక్షి” ఔదార్యం..!

సాక్షి మీడియా గ్రూప్ కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఏడాది పాటు జీతం ఇవ్వాలని నిర్ణయించుకుంది. రూ. పాతిక వేలు లేదా జీతం ఏది తక్కువ అయితే అది ఇస్తామని.. సాక్షి మీడియా గ్రూప్ ఈడీ అండ్ సీఈవో విజయ్ మహేశ్వరి పేరుతో ఉద్యోగులకు లేఖ అందింది. పన్నెండు నెలల జీతంతో పాటు రెండు రకాల ఇన్సూరెన్స్‌ల కింద…మరో పది లక్షల వరకూ బెనిఫిట్స్ అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. అయితే కరోనాతో ఏప్రిల్ ఒకటి నుండి చనిపోయిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది.

ఇటీవలి కాలంలో సాక్షి మీడియా గ్రూప్‌లో పలువురు కరోనా బారిన పడి చనిపోయారు. చనిపోయిన పదుల సంఖ్యలో ఉండరు. ఓ పది మందికి అటూ ఇటూగానే ఉంటారు. అయితే.. వారు ఈ రెండు నెలల్లో చనిపోయిన వారు కాదు. అంతకు ముందుకూడా కొంత మంది మరణించారు. డేట్ ఫిక్స్ చేయడం .. గత రెండు నెలల గురించే చెప్పడం వల్ల… సాక్షిలో పని చేస్తూ చనిపోయిన పలువురు ఉద్యోగుల కుటుంబాలు ఈ బెనిఫిట్స్ పొందడానికి అర్హత లేకుండా పోయారు. అలాంటి వారిలో సీనియర్ ఉద్యోగుల కుటుంబాలు కూడా ఉన్నాయి.

‌అలాగే సాక్షి తరపున అనేక మంది ఫ్రిలాన్సర్లుగా పని చేస్తూ.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వారికి కంపెనీ తరపున ఎలాంటి సాయం అయినా అందిస్తారో లేదో స్పష్టత లేదు. బేధాలు చూడకుండా.. అందర్నీ ఆదుకోవాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. అయితే మీడియాలోని ఇతర సంస్థల కంటే… ఇంతో ఇంతో.. ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ నిర్ణయం తీసుకున్నసాక్షినే బెటర్ అని.. జర్నలిజం సర్కిల్స్‌లో చర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close