ఏపీలో విద్యుత్ ఉద్యోగుల జీతాల తగ్గింపు..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగాల జీతల విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. వారి జీతాలను పెద్ద మొత్తంలో తగ్గించడానికి దాదాపుగా కసరత్తు పూర్తయింది. విద్యుత్ సంస్థల సిబ్బంది పే స్కేల్‌లో మార్పులు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలను అమలుచేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. నిజానికి చంద్రబాబు హయాంలో 1998లో విద్యుత్‌ రంగంలో సంస్కరణల అమలు చేశారు. అప్పటి ఒప్పందాలను బట్టి తర్వాత ఆరుసార్లు వేతన సవరణ జరిగింది. దీని ప్రకారం తగ్గించిన ఫిట్‌మెంట్‌తో పాటు ఏడాదికి మూడు వంతున ఒక్కో ఉద్యోగికి 18 ప్రత్యేక ఇంక్రిమెంట్లు వచ్చాయి.

దశాబ్దాల కింద కుదిరిన వేతన ఒప్పందంపై యాజమాన్యం, అప్పటి సీఎం సంతకాలు చేశారు. చివరగా 2018 మే 31న జరిగిన వేతన ఒప్పందం 2022 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది. ఈ ఒప్పందం కారణంగా సుదీర్ఘ సర్వీస్ ఉన్న స్వీపర్‌కు కూడా రూ. లక్ష వరకూ జీతం అందుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం.. ఆ జీతాలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగుల జీతాల్లో మాస్టర్‌ స్కేల్‌కు మించిన మొత్తాన్ని పర్సనల్‌ పేలో ఉంచాలని ఇటీవలి బోర్డు సమావేశంలో నిర్ణయించి.. ప్రభుత్వానికి పంపారు. ఈ విషయం గోప్యంగా సాగిపోయింది.

బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. విద్యుత్‌ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి పదవీవిరమణ ప్రయోజనాల్లో కనీసం రూ.30-40 లక్షలు నష్టపోయే అవకాశం ఉంది. వచ్చే పింఛను భారీగా తగ్గుతుంది. నిజానికి ప్రభుత్వం తమ జీతాలను తగ్గిస్తుందన్న భయంతో.. చాలా మంది ఉద్యోగులు… గత రెండేళ్లలో స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు మూడేళ్లలో పదవీవిరమణ చేసే సిబ్బంది ప్రయోజనాలు తగ్గుతాయన్న భయంతో ఇదే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం …ప్రభుత్వంలో కాక రేపుతోంది. విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తాయో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే.. వినతి పత్రాలకే పరిమితమయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close