ప‌వ‌న్‌కి అస్స‌లు టైమ్ ఇవ్వ‌ని స‌ముద్ర‌ఖ‌ని

‘బ్రో’ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాని చ‌క చ‌క పూర్తి చేశాడు. ప‌వ‌న్ సినిమా ఇంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందంటే.. దానికి కార‌ణం.. స‌ముద్ర‌ఖ‌నినే. షూటింగ్ చ‌క చ‌క పూర్తి చేయ‌డంలో త‌ను సిద్ధ‌హ‌స్తుడు. బ్రో కూడా యమ స్పీడుగా లాగించేశాడు. ప‌వ‌న్ తో షూటింగ్ అంతా కేవ‌లం 21 రోజుల్లోనే పూర్తి చేశాడు స‌ముద్ర‌ఖ‌ని.

ఈ క‌థ ప‌వ‌న్‌కి వినిపించ‌గానే.. ”ఓకే.. చేద్దాం.. ఎప్ప‌టి నుంచి షూటింగ్ పెట్టుకొంటారు” అని ప‌వ‌న్ అడిగితే.. ‘రేప‌టి నుంచే..’ అంటూ స‌ముద్ర‌ఖ‌ని తొంద‌ర‌పెట్టాడ‌ట‌. ఈరోజు క‌థ విని.. రేపు షూటింగ్ ఏమిట‌ని ప‌వ‌న్ సైతం ఆశ్చ‌ర్య‌పోయాడ‌ట‌. ”ఈ సినమా సెట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరెప్పుడు వచ్చినా షూటింగ్ చేసుకొంటా” అని స‌ముద్ర‌ఖ‌ని స‌మాధాన‌మిచ్చాడు. ”నా ప్లానింగ్ చూసి ప‌వ‌న్ షాక‌య్యారు. నా క‌మిట్‌మెంట్ న‌చ్చి.. మ‌రుస‌టి రోజే షూటింగ్ కి వ‌చ్చేశారు. నేను ఈ సినిమాని వేగంగా పూర్తి చేశానంటే దానికి కార‌ణం ప‌వ‌న్ సారే. ఆయ‌న చెప్పిన టైమ్‌కి షూటింగ్ కి వ‌చ్చేవారు. ఆయ‌న స‌హ‌కారం వ‌ల్లే అనుకొన్న స‌మ‌యానికి ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు స‌ముద్ర‌ఖ‌ని. ‘వినోదాయ సీత‌మ్‌’కి సీక్వెల్ కూడా ఉంద‌ట‌. అయితే.. ఈ క‌థ‌ని మిగిలిన భాష‌ల్లోనూ రీమేక్ చేశాకే… సీక్వెల్ గురించి ఆలోచిస్తాన‌ని చెప్పుకొచ్చాడీ ద‌ర్శ‌కుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close