సండూర్ పవర్ “పీపీఏ” రేటు రూ. నాలుగున్నర..!

ఇప్పుడు కరెంట్ బహిరంగ మార్కెట్లో.. రూ. రెండు రూపాయలలోపే వస్తోందని… చంద్రబాబు సర్కార్.. రూ. నాలుగున్నర రూపాయలు పెట్టి కొనుగోలు చేసిందని.. ఆరోపణలు చేస్తూ.. పవర్ పర్చేజింగ్ ఒప్పందాలను సమీక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయనకు కూడా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలున్నాయి. సండూర్ పవర్ అనే కంపెనీతోనే ఆయన వ్యాపార ప్రస్థానం ప్రారంభమైంది. జనగ్ మోహన్ రెడ్డి కంపెనీలన్నింటికీ అదే మూలమైన కంపెనీ. ఆ కంపెనీ నుంచి ఇతర కంపెనీలు పుట్టుకొచ్చాయి. సండూర్ పవర్ కంపెనీ ప్రధాన వ్యాపకం.. విద్యుత్ ఉత్పత్తి. ఏ విద్యుత్ కంపెనీ అయినా.. విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికే విక్రయిస్తుంది. అలాగే సండూర్ పవర్ కూడా..కర్ణాటక ప్రభుత్వానికి విక్రయిస్తుంది.

ఇందు కోసం.. ఆ ప్రభుత్వంలో సండూర్ పవర్ కంపెనీ కూడా పీపీఏ చేసుకుంది. దీని ప్రకారం.. సండూర్ పవర్‌కు.. కర్ణాటక సర్కార్.. ఇస్తున్న ధర అక్షరాలా రూ. 4 రూపాయల యాభై పైసలు. అంటే.. నాలుగున్నర రూపాయలకు.. తన కంపెనీ విద్యుత్ ను జగన్మోహన్ రెడ్డి అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ మీడియా పాయింట్ లో బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి… తన కంపెనీ విద్యుత్ అమ్మకానికి అంత మొత్తంతో.. పీపీఏ కుదుర్చుకున్నప్పుడు.. ఏపీలో.. అంతే మొత్తం కుదుర్చుకున్నప్పటికీ.. ఆరోపణలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. పీపీఏల్లో.. ఎలా ధరలు నిర్ణయం అవుతాయో.. అందరికీ తెలుసని.. అయినా.. గత ప్రభుత్వంపై.. ప్రతీకారేచ్చతోనే జగన్మోహన్ రెడ్డి పీపీఏలపై రాద్దాంతం చేస్తున్నారని అంటున్నారు.

నిజానికి జగన్మోహన్ రెడ్డికి.. సండూర్ పవర్ పేరుతో అధికారికంగా వ్యాపార సంస్థ ఉన్నప్పటికీ.. ఆయనకు … ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పలు విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి .. కేంద్రం.. హెచ్చరిస్తున్నప్పటికీ.. పీపీఏలపై పట్టుదలకు పోవడం… అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close