ఇట్స్ అఫీషియల్ – అప్రూవర్ గా అరబిందో శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరబిందో వారసుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత అనూహ్యంగా జరిగిపోయిన ఈ పరిణామం తర్వాత శరత్ చంద్రారెడ్డికి ముందు జాగ్రత్తగా వై కేటగిరి సెక్యూరి్టీని కల్పించినట్లగా తెలుస్తోంది.

శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా పూర్తి స్థాయిలో ఇరుక్కుపోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందరూ కలిసి స్కాం చేసినందున.. అసలు స్కాం ఎలా జరిగింది.. నగదు వ్యవహారాలు ఎలా జరిగాయో వీరు బయటపెడారు. వీరు అప్రూవర్ గా మారినందున వీరికి పరిమిత శిక్షలు అమలు చేస్తారు. కానీ అసలు కేజ్రీవాల్, కవిత మాత్రం పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉన్నారు. ఆయన భార్య అనారోగ్యం కారణంగానే బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సౌత్ నుంచి కవిత, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని వీరు ముగ్గురికి ఢిల్లీలో వ్యాపారాలున్నాయని సీబీఐ ఈడీలు చెబుతున్నాయి. అందరూ కలిసే ఈ స్కాం చేశారని అంటున్నారు. చాలా కాలంగా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చేప్రయత్నం జరిగినా సాధ్యం కాలేదు కానీ.. అరబిందో ఫ్యామిలీతో దగ్గర సంబంధాలు ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ జోక్యంతో వారు అప్రూవర్ గా మారిపోయినట్లుగా తెలుస్తోంది.

కేసఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండే.. జగన్.. తాను ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆయన కుమార్తెను చిక్కుల్లో పడేయడానికి కూడా వెనుకాడలేదన్న ఆగ్రహం బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close