ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా శశిధర్ అనే పెద్దమనిషిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ శశిధర్ ఎవరంటే.. వైసీపీ కార్యకర్తకు ఎక్కువ… ఉన్నత విద్యాధికుడికి తక్కువ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆ పార్టీకి సపోర్టు చేశారు. అమరావతిపై నిందలేశారు. ప్రభుత్వం వైపు నుంచి దక్కించుకోవాలనుకున్నవి దక్కించుకున్నారు.
ఇప్పుడు ఆయనకు ఏపీపీఎస్సీ సభ్యుడి పదవిని ప్రభుత్వం ప్రకటించింది. అది రాజకీయాలకు అతీతమైన పదవి. అక్కడ రాజకీయాలు చూడకూడదు అనుకుంటే.. మంచి విద్యాధికుడ్ని.. న్యూట్రల్ ను చూసి ఇవ్వవొచ్చు. కానీ వైసీపీకి మద్దతు ప్రకటించిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ?. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని కాకాపట్టి పదవులు పొందుతారని సోషల్ మీడియాలో కొంత మంది చెబుతున్నారు. ఇలాంటి వారికి పదవులు ఇచ్చే సామాన్య కార్యకర్తలు ఎలా ఫీలవుతారు?
ఇంతకు ముందు ఓ వైసీపీ నేతకు.., జగన్ రెడ్డి అంటే పడి చచ్చే నేతకు.. పర్యావరణంలో కృషి చేస్తున్నారని సలహాదారు పదవి ఇచ్చేశారు. ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో గగ్గోలు రేగింది. సామాన్య కార్యకర్తలు.. తమకు ఏ ప్రయోజనం లేదని అనుకోవడం కాకుండా.. ఇలాంటి వారికి పదవులు ఇస్తున్నారని తెలిస్తే.. ఇంకా ఫీలవుతారు. ఇలాంటి సున్నితమైన అంశాలే కీలకం. టీడీపీ హైకమాండ్ ఇప్పటికైనా జాగ్రత్తపడితే బెటర్. లేకపోతే.. చంద్రబాబు చెబుతున్నట్లుగా కార్యకర్తలు ఇంట్లో పడుకుండిపోతారు.