విద్యావ్యవస్థ విచ్చిన్నం – బడికి లక్షల మంది పిల్లలు దూరం !

ఏపీలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సంఖ్య ఈ ఏడాది భారీగా పడిపోయింది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా సగానికి సగం మంది తగ్గారు. 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రస్తుత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి ఐదున్నర లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారని తేలింది. ప్రభుత్వం అధికారికంగా లెక్కలు విడుదలచేయలేదు. కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం అసలు విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. వీటికి కారణం ప్రధానంగా రెండే. ఒకటి పాఠశాలల్ని విలీనం చేయడం.. రెండు ఇంగ్లిష్ మీడియం.

ప్రభుత్వం విద్యా శాఖలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇటీవల పాఠశాలల్ని విలీనం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో దూరాభారం అవడం వల్ల చాలా మంది బడి మానేశారు. మరి కొంత మంది సమీపంలోని ప్రైవేటు స్కూళ్లలో చేరిపోయారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మొత్తం ఇంగ్లిష్ మీడియంను అమలు చేయడం ప్రారంభించింది. చట్ట ప్రకారంగా తెలుగు మీడియా కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ తెలుగు మీడియంను అనధికారికంగా నిలిపివేశారు. ఇంగ్లిష్ మీడియంలోనే బలవంతంగా చేర్పించేశారు. ఈ కారణంగా లక్షల్లో డ్రాపౌట్‌లు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ స్కూళ్ల మీద … పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. వేల కోట్లతో పథకాలు అమలు చేస్తున్నారు. నాడు – నేడు పేరుతోనూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగాలి. కానీ తగ్గితే ప్రభుత్వ కృషి ఫలించనట్లే. నిజానికి విద్యా వ్యవస్థపై ప్రభుత్వ దృక్ఫథంతోనే పొరపాటు ఉంది. స్కూళ్లకు రంగులు వేసి .. రంగుల కుర్చీలుతెచ్చి పెట్టినంత మాత్రాన పిల్లలకు చదువు రాదని.. ముందుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాలి. కానీ ఆ పని చేయలేదు. ట్యాబులిస్తాం.. రంగులేయిస్తాం… అమ్మఒడి ఇస్తాం అని.. చెప్పి మొత్తానికి పేద పిల్లల చదువుపై పెద్ద బండ వేసేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close