విమర్శలు లైట్ .. ఆగిన చోట నుంచి పరిషత్ ఎన్నికలు..!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొత్త నోటిఫికేషన్ లేదని.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలా చేసినందున… విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకగ్రీవాల విషయంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ స్వయంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు అదే విషయాన్ని ఎత్తి చూపుతూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మార్చి పధ్నాలుగో తేదీ నుంచి పరిషత్ ఎన్నికలు జరపాలనుకుంటున్న నిమ్మగడ్డ.. పురపాలక ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే ఏకగ్రీవాల విషయంలో ఓ ప్రకటన చేశారు. నామినేషన్ల విషయంలో అవకతవకలు జరిగిన చోట ఫిర్యాదులు చేస్తే నామినేషన్లకు చాన్సిస్తామని ఆయన ప్రకటించారు.

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. బెదిరించడం లాంటి ఘటనలు జరిగిన చోట వారికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే.. మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని.. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తన ఆదేశాల్లో చెప్పుకొచ్చింది. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు,.. పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలన్న ఎస్ఈసీ సూచించింది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నని ఆఫర్ ఇచ్చింది.

ప్రభుత్వంతో రాజీపడిపోయి ఎన్నికల నిర్వహణలోనూ… ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తున్నారని విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. బెదిరింపులు, దాడుల వల్ల నామినేషన్లు వేయని వారు.. ఇప్పుడు ఎలా ఫిర్యాదులు చేస్తారని .. రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. అఖిలపక్ష పార్టీ భేటీలోనూ ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాయి. కానీ నిమ్మగడ్డ మాత్రం.. ఇప్పుడు… కొత్త నోటిఫికేషన్ గురించి మర్చిపోయి… ఆగిన చోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close