విమర్శలు లైట్ .. ఆగిన చోట నుంచి పరిషత్ ఎన్నికలు..!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొత్త నోటిఫికేషన్ లేదని.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలా చేసినందున… విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకగ్రీవాల విషయంలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని.. ఎస్ఈసీ నిమ్మగడ్డ స్వయంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు అదే విషయాన్ని ఎత్తి చూపుతూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. మార్చి పధ్నాలుగో తేదీ నుంచి పరిషత్ ఎన్నికలు జరపాలనుకుంటున్న నిమ్మగడ్డ.. పురపాలక ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే ఏకగ్రీవాల విషయంలో ఓ ప్రకటన చేశారు. నామినేషన్ల విషయంలో అవకతవకలు జరిగిన చోట ఫిర్యాదులు చేస్తే నామినేషన్లకు చాన్సిస్తామని ఆయన ప్రకటించారు.

నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం.. బెదిరించడం లాంటి ఘటనలు జరిగిన చోట వారికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే.. మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని.. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తన ఆదేశాల్లో చెప్పుకొచ్చింది. గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు,.. పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలన్న ఎస్ఈసీ సూచించింది. ఫిర్యాదులు లేకపోయినా.. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా.. కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నని ఆఫర్ ఇచ్చింది.

ప్రభుత్వంతో రాజీపడిపోయి ఎన్నికల నిర్వహణలోనూ… ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తున్నారని విపక్షాలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. బెదిరింపులు, దాడుల వల్ల నామినేషన్లు వేయని వారు.. ఇప్పుడు ఎలా ఫిర్యాదులు చేస్తారని .. రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. అఖిలపక్ష పార్టీ భేటీలోనూ ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరాయి. కానీ నిమ్మగడ్డ మాత్రం.. ఇప్పుడు… కొత్త నోటిఫికేషన్ గురించి మర్చిపోయి… ఆగిన చోట నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close