మున్సిపల్ ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు..!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియతను గతంలో ఎక్కడ ఆపారో అక్కడి నుంచే కొనసాగించాలని ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో .. నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికల్లో ఎవరైనా బలవంతంగా నామినేషన్ విత్‌ డ్రా చేయించారని ఫిర్యాదు చేస్తే.. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్క్రూటినీ ఆమోదం పొందిన అభ్యర్థులు బలవంతంగా విత్‌ డ్రా అయితే.. ఆర్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చన్న ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొంది.

మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు వేయనివ్వకపోవడం.. వేసిన వారిని బెదిరించి ఉపసంహరించుకునేలా చేయడం వంటి ఘటనలు జరిగాయి. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. స్వయంగా ఎస్‌ఈసీ రమేష్ కుమార్ కూడా.. ఈ అంశాన్ని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. చిత్తూరు, కడప జిల్లాలతో పాటు గుంటూరులోని మాచర్ల మున్సిపాల్టీలో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. అక్కడ పట్ట పగలు… టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగింది. దీనిపై పోలీసులు పట్టించుకోకపోడంతో భద్రతా భయం ఏర్పడింది.

దాడులు దౌర్జన్యాలతో మున్సిపాల్టీని కూడా ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ పరిణామాల మధ్య… వాటి గురించి ఏ మాత్రం ఆలోచించని ఎస్‌ఈసీ .. ఎన్నికలు ఎక్కడ ఆపేశామో.. అక్కడ్నుంచే ప్రారంభిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తీవ్రమైన విమర్శలు రావడంతో ఇప్పుడు..అలాంటి వాటిపై ఫిర్యాదులు వస్తే పరిశీలించాలని సర్క్యూలర్ ఇచ్చారు. కానీ నామినేషన్లు వేసేందుకు రెండు రోజులు గడువు ఇవ్వాలని ఇతర పార్టీలు కోరుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close