వారు ఉద్యోగులా..? ఇంట్లో పని మనుషులా -ఇదేం పద్ధతి గురూ..!!

తెలంగాణలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పవర్ చేతుల్లో ఉండటంతో నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారుల ఛాంబర్ లో పని చేసేందుకు ప్రభుత్వం అటెండర్లను నియమిస్తే వారిని అధికారులు తమ సొంతింటి పనుల కోసం వాడుకోవడం గమనార్హం.

సొంత ఇంటి అవసరాల కోసం అధికారులు ఒక్కరిద్దరితో కాదు… ఏకంగా పదిమందితో పనులు చేయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నాతాధికారుల ఇళ్లలో హౌజ్ కీపింగ్ , వెహికిల్ క్లీనింగ్ , గార్డెనింగ్ పనులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఏకంగా ముప్పై మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారని…మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో పది మంది పని చేస్తున్నట్లు టాక్. ఇలా చాలామంది ఉన్నతాధికారుల నివాసాలలో కింది స్థాయి ఉద్యోగులను సొంతింటి పనుల కోసం వాడుకుంటున్నారని సచివాలయ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల సచివాలయంలో ఓ డేటా ఎంట్రీ ఎంప్లాయ్ మృతి వెనక ఉన్నతాధికారి వేధింపులే కారణమని ఆరోపణలతో ఈ విషయం బయటకు వచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని కానీ, విషయం బయటకు చెప్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందనే భయంతో వారు మౌనం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సొంతింటి అవసరాల కోసం వాడుకుంటున్నారనే విషయం నిఘా వర్గాలకు గుర్తించినట్లు సమాచారం. దాంతో సచివాలయంలో కీలక హోదాలోనున్న ఉన్నతాధికారుల వద్ద ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు…? ఎంతమందిని తమ ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారనే విషయాన్ని తేల్చి సీఎంవో అధికారులకు రిపోర్ట్ చేరవేయనున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close