ఆశల పల్లకీలో వైసీపీ సీనియర్ బీసీ ఎమ్మెల్యేలు..!

ఇద్దరు బీసీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి రాజ్సభ సీట్లు ఇవ్వడంతో.. ఆ రెండు మంత్రి పదవుల కోసం వైసీపీలో రేస్ ప్రారంభమయింది. ఆ రెండు మంత్రివర్గ ఖాళీల్లోనూ బీసీలనే తీసుకోవడం ఖాయం. ఎన్నికల్లో తేడా ఫలితాలు వస్తే.. మంత్రులు ఎవరైనా తొలగిస్తారనే ఊహాగాలను పక్కన పెడితే.. రెండు బెర్తులు మాత్రం బీసీ వర్గాలకు ఖాయమయ్యాయి. దీంతో.. వైసీపీలోని బీసీ నేతలు.. తమ దూకుడు ప్రారంభించారు. ఇలాంటి వారిలో అందరి కంటే ముందు ఉన్న నేత .. పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధి. ఆయన వైఎస్ హయాంలోనే మంత్రిగా చేశారు. కృష్ణా జిల్లా నుంచి బీసీ నేతగా ఎదిగారు. ఆయనకు మొదట మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు కానీ.. కొడాలి నాని, పేర్ని నాని ఖాతాలో పడిపోయాయి. అప్పుడే ఆయన అసంతృప్తికి గురయ్యారు.

ఇప్పుడు బీసీ కోటాలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తన నియోజకవర్గంలో భారీ ఫలితాల్ని సాధించడంతో పాటు.. ముఖ్యమంత్రిని ఆకర్షించేందుకు.. బీసీ నినాదాన్ని పార్టీ తరపున గట్టిగా వినిపించడం ప్రారంభించారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లను చంద్రబాబే అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు జగన్‌ ఇచ్చారని … జగన్ కన్నా గొప్పగా బీసీలకు ఎవరూ సాయం చేయలేదన్నట్లుగా ప్రకటలు చేస్తున్నారు. అయితే పార్ధసారధికి మాత్రం.. కృష్ణా జిల్లా నుంచి బీసీకోటాలో పదవి రావాలంటే.. కొడాలి నానికో.. పేర్ని నానికో పదవి ఊడాల్సిందే.

గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి బీసీ పదవులు ఖాళీ అయ్యాయి. ఆయా జిల్లాల నుంచే పదవులు భర్తీ చేయాలి. లేకపోతే.. జిల్లాల సమతూకం దెబ్బతింటుంది. ఆయా జిల్లాల నుంచి గెలిచిన బీసీ నేతల్లో ఎక్కువ మంది కొత్త వాళ్లే ఉన్నారు. అలాంటి వారికి అవకాశం దక్కుతుందో .. సీనియర్లుగా తమను జగన్ గుర్తిస్తారో లేదోనని పార్థసారధి లాంటి వాళ్లు నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close