కాల్-డాటా ఇచ్చారు సరే, చూడనీకపోతే ఏమి ప్రయోజనం?

ఐడియా, వోడా ఫోన్, ఎయిర్ టెల్, డొకోమో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇవ్వాళ్ళ విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకి మరో 25 ఫోన్ నెంబర్ల తాలూకు కాల్-డాటాని సీల్డ్ కవర్లో అందించారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు 29 నెంబర్ల సంబంధించిన కాల్-డాటాని సీల్డ్ కవర్లో కోర్టుకి అందించారు. హైకోర్టు ఆదేశానుసారం రెండుసార్లు కూడా ఆ సీల్డ్ కవర్లను ప్రత్యేక దూత ద్వారా తిరిగి హైకోర్టుకి పంపించబడ్డాయి. సుప్రీం కోర్టు ఆ వివరాలను విజయవాడ కోర్టుకి ఇచ్చేందుకు సర్వీస్ ప్రొవైడర్లను అనుమతించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో సుప్రీం ఆదేశాలను మన్నిస్తూ ఆ వివరాలను విజయవాడ కోర్టుకి సీల్డ్ కవర్లో పంపించడం తిరుగు టపాలో మళ్ళీ దానిని హైకోర్టుకి త్రిప్పి పంపిస్తుండటం జరుగుతోంది.

కాల్-డాటా వివరాలను తెరిచి చూసేందుకు అనుమతించనప్పుడు ఇదొక ప్రహసనంగా మిగులుతుందే తప్ప ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నటికీ తన ఆరోపణలను నిరూపించలేదు. ఒకవేళ ఊహించని విధంగా ఓటుకి నోటు కేసులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణా ప్రభుత్వం నోటీసులు పంపిస్తే అప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మరెవరికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు పంపించలేదు. ఎందుకంటే తన ఆరోపణలను రుజువు చేసే వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. అవన్నీ హైకోర్టులో భద్రపరచబడ్డాయి. అవి తెరిచి చూడాలనుకొంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అనుమతి అవసరం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న విజయవాడ కోర్టు అడిగినా ఆ వివరాలను కోర్టుకి చూపించలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ వివరాలు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈకేసును వచ్చేనెల 10కి విజయవాడ కోర్టు వాయిదా వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close