శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ త‌ర‌వాత ఆ స్థాయిలో గూజ్‌బమ్స్ ఇచ్చిన ట్రైన్ ఎపిసోడ్ రాలేద‌నే చెప్పాలి.

అయితే ఇప్పుడు శంక‌ర్ సినిమాలో అలాంటి సీన్ ఒక‌టి ఉంద‌ట‌. రామ్ చ‌ర‌ణ్‌తో శంక‌ర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క‌మైన ఘ‌ట్టంలో ట్రైన్ ఎపిసోడ్ వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ ఎపిసోడ్ లో రామ్ చ‌ర‌ణ్ హీరోయిజాన్ని ఓ స్థాయిలో ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టాల‌ని, ఎక్కువ రోజులు షూట్ చేయాల‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఇదో యాక్ష‌న్ ఘ‌ట్టం. వంద‌లాంది మంది ఫైట‌ర్లు అవ‌స‌ర‌మ‌ట‌. ఈ సినిమాలో ఈ ట్రైన్ ఫైట్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కాబోతోంద‌ని తెలుస్తోంది. అందుకోసం ఓసెట్ కూడా వేయాల్సివ‌స్తోంద‌ట‌. దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఆ బ‌డ్జెట్ రాను రాను పెర‌గొచ్చు కూడా. ఈ ట్రైన్ ఎపిసోడ్‌కే క‌నీసం ప‌ది కోట్ల‌యినా ఖర్చువుతంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అంజ‌లి, సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close