వివేకా హత్యపై జగన్ క్యాంప్‌కు షాకిచ్చే నిజాలు చెప్పిన షర్మిల !

వైఎస్ వివేకా హత్య ఆస్తుల కోసమే జరిగిందంటూ కథలు అల్లుతున్న జగన్ రెడ్డి క్యాంప్‌కు సోదరి షర్మిల ఘాటైన రిప్లయి ఇచ్చింది. అసలు ఆస్తుల అంశమే ఆ కుటుంబంలో లేదని స్పష్టం చేసింది. వైఎస్ వివేకాకు ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీతకు రాసేశారని.. ఆయన పేరుపై ఎలాంటి ఆస్తులు లేవని షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె వైఎస్ వివేకా హత్య విషయంలో జగన్ రెడ్డి క్యాంప్ చేస్తున్న ఆరోపణలపై నేరుగానే స్పందించారు.

వివేకా పేరుపై లేని ఆస్తుల కోసం ఎవరు హత్య చేస్తారని.. సునీత భర్త ఆస్తుల కోసం చంపాలనుకుంటే.. ఆస్తులన్నీ సునీత పేరుపై ఉన్నాయి కాబట్టి సునీతనే చంపాలన్నారు. అదే సమయంలో వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ ఆయనో ఉమనైజర్ అన్నట్లుగా చిత్రీకరిస్తున్న జగన్ రెడ్డి క్యాంప్‌పై షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయన సాధారణ జీవితం గడిపారన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నీలి కూలీ మీడియాపై మండిపడ్డారు.

చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని.. ఆయనేంటో కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు. షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవినాష్ రెడ్డి ని కాపాడటానికి చనిపోయిన వివేకాపై అత్యంత దారుణమైన నిందల్ని వేస్తున్నారు. లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. కోర్టుల్లో దాఖలు చేసే అఫిడవిట్లలోనూ ఈ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే .. వివేకా హత్యానేరాన్ని రాజశేఖర్ రెడ్డి, సునీతలపై వేయడానికి ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ అవి కూడా వివేకా పేరు మీద లేవని షర్మిల క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు జగన్ రెడ్డి క్యాంప్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close