నా కెరీర్‌లో ఇదే బెస్ట్ ఫిల్మ్‌: శ‌ర్వానంద్‌

ఆడాళ్లూ మీకు జోహార్లూ.. సినిమాపై ముందునుంచీ మంచి బ‌జ్ ఉంది. టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్‌తో అది ఇంకాస్త ఎక్కువైంది. ల‌క్కీ ఛార్మ్ ర‌ష్మిక తోడ‌వ్వ‌డంతో… ఆడాళ్లు క్రేజ్ పెరిగింది. దానికి త‌గిన‌ట్టే బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జ‌రిగింది. ఈ సినిమాపై కూడా శ‌ర్వా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అది క‌నిపించింది. ”ఈ సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్‌గా మిగిలిపోతుంది.. రాసిపెట్టుకోండి” అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు శ‌ర్వా. ఈమ‌ధ్య కాలంలో సీరియ‌స్ సినిమాలే చేస్తున్నాడ‌న్న‌ది శ‌ర్వాపై కంప్లైంట్‌. ఈ విష‌యాన్ని శ‌ర్వా కూడా ఒప్పుకున్నాడు. ”నా బ‌లం ఫ్యామిలీ ఎలిమెంట్స్‌. అది ఈ సినిమాలో అడుగడుగునా క‌నిపిస్తాయి. అందుకే ఈ సినిమాపై నాకు అంత న‌మ్మ‌కం కుదిరింద‌”న్నాడు శ‌ర్వా. ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి అతిథిగా వ‌చ్చిన సుకుమార్ సైతం ఇదే మాట అన్నాడు. శ‌ర్వా బ‌లం కామెడీ సినిమాల‌ని, అయితే. త‌ను ఈ మ‌ధ్య చాలా సీరియ‌స్ సినిమాలు చేస్త‌న్నాడ‌ని, ఈ సినిమాలో మాత్రం పాత శ‌ర్వా క‌నిపిస్తున్నాడ‌ని సుకుమార్ చెప్పాడు. ”దేవిశ్రీ జ‌డ్జ్‌మెంట్ అంటే నాకు గురి ఎక్కువ‌. బాగా నచ్చితే గానీ ఏ సినిమా గురించీ పెద్ద‌గా మాట్లాడ‌డు. కానీ ఈ సినిమా చూశాక మాత్రం.. సూప‌ర్ హిట్ అవుతుంద‌న్నాడు. కాబ‌ట్టి.. ఇది సూప‌ర్ హిట్టే” అని జోస్యం చెప్పాడు సుకుమార్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close