కేంద్రమంత్రిని అరెస్ట్ చేసిన శివసేన ప్రభుత్వం..!

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య మరో రగడ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాక్రే చెంప పగలగొడతానని ఆయన వ్యాఖ్యానించడంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. నారాయణ్ రాణే కేంద్రమంత్రి మాత్రమే కాదు ..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూడా. అదే సమయంలో శివసేనలో చాలా కాలం పాటు అనేక కీలక పదవులు నిర్వహించిన వ్యక్తి కూడా. అయితే ఆయన కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరారు. ఇటీవల జరిపిన మంత్రివర్గ పునర్వవవస్థీకరణలో నారాయణ్ రాణెకు ప్రధాని నరేంద్రమోడీ కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. ఆ ఉత్సాహంలో ఉన్న ఆయన .. బీజేపీ నిర్దేశించినట్లుగా జన ఆశీర్వాద్ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో ఆయన కాస్త ఆవేశానికి గురయ్యారు.

ఆగస్టు పదిహేను వేడుకల సందర్భంగా సీఎం ఉద్దవ్ ధాకరే ప్రసంగంలో మధ్యలో ఉండగా వెనక్కి తిరిగి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లయిందని సహాయకుడిని అడిగారు. ఈ ఘటనను ప్రస్తావించిన నారాయణ్ రాణే ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలియకపోవడం సిగ్గుచేటని ఆ సమయంలో తాను అక్కడ ఉండి ఉంటే గట్టిగా చెంప దెబ్బ కొట్టి ఉండేవాడినన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో శివసేన నేతలు తీవ్రంగా స్పందించి, రాణేపై ఫిర్యాదులు చేశారు. పోలీసులు కూడా కేసులు నమోదు చేసుకుని అరెస్టు చేశారు. కేంద్రమంత్రిని అరెస్ట్ చేయడానికి చేపట్టాల్సిన లాంఛనాలన్నీ చేపట్టారు. ముందస్తు బెయిల్ కోసం రాణె చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.

చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినని చేసిన వ్యాఖ్యలకే అధికారంలో ఉన్న కేంద్రమంత్రిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ప్రతిక్ష నేత జగన్ కాల్చి చంపినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో పోలీసులు కేసులు కూడా పెట్టలేదు. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర రాజకీయం ఆసక్తి రేపుతోంది. కేంద్రమంత్రినే అరెస్ట్ చేయిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ హెచ్చరించారు. దీంతో బీజేపీ – శివసేన మధ్య మరోసారి రచ్చ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close