మోడీ సర్కార్ పై శివసేన మళ్ళీ నిప్పులు

మహారాష్ట్రాలో శివసేన పార్టీ భాజపాకి మిత్రపక్షంగా, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. కానీ దాని అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అప్పుడప్పుడు భాజపా, ఆర్.ఎస్.ఎస్.లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఏపిలో తెదేపా చిన్న విమర్శ చేసినా తట్టుకోలేని భాజపా, ఆయన ఎంత తీవ్ర విమర్శలు చేసినా అసలు పట్టించుకోదు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ మనుగడ ఆయన చేతిలో ఉన్నందునే కావచ్చు.

శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో ఉద్ధవ్ థాకరే భాజపా, ఆర్.ఎస్.ఎస్, పిడిపిల గురించి ఏమని వ్రాసారంటే న్నారంటే “జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం భారత్ తో కంటే వేర్పాటువాదులవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లుంది. ఆ రాష్ట్రంలో పిడిపి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భాజపా కూడా ఎంతసేపు తన అధికారాన్ని కాపాడుకోవడం పైనే దృష్టి పెడుతోంది తప్ప శ్రీనగర్ లో పెరుగుతున్న భారత వ్యతిరేకత, ఐసిస్, పాక్ జెండాల రెపరెపలను పట్టించుకోవడం లేదు. జాతీయవాదం తన సొత్తు అన్నట్లుగా మాట్లాడుతున్న ఆర్.ఎస్.ఎస్. నేతలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తమ అతివాదాన్ని వదులుకోవాలి. 50 లక్షలు జనాభా ఉన్న ప్రాంతాలను రాష్ట్రాలుగా విభాజించాలన్న దాని వాదన ఎంత ప్రమాదకరమో దానికి తెలియడం లేదు. ఒకసారి భారత్ ని చిన్న చిన్న రాష్ట్రాలుగా విడగొడితే ఇంక భారత్ విచ్చిన్నం కావడానికి ఎంతో సేపు పట్టదు. గత ప్రభుత్వంతో పోల్చితే ఇప్పటి ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి,” అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

భారత్ కంటే చైనా, ఇజ్రాయిల్ దేశాలే చాలా వేగంగా అభివృద్ధి చెందాయన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలకి జవాబిస్తూ “ఆ రెండు దేశాలు భారత్ కంటే ఎందుకు ఎక్కువ అభివృద్ధి చెందాయంటే అవి ఏనాడూ జాతీయవాదంపై రాజీ పడలేదు. ఆ రెండు దేశాలు దేశద్రోహులతో రాజీ పడలేదు..ఎన్నడూ వారిని ఉపేక్షించలేదు. తమ దేశంలో జాతి వ్యతిరేక నినాదాలను, ఆలోచనలను చివరికి జెండాల ప్రదర్శనను కూడా అవి ఉక్కుపాదంతో అణచివేసాయి. అందుకే అవి అంతగా అభివృద్ధి చెందాయి. కానీ మనదేశంలో రాజకీయ లబ్ది ఉంటుందంటే దేశాని విచ్చినం చేయజూసే శక్తులతో కూడా చేతులు కలిపే వాళ్ళున్నారు. అదే మనకి ఆ దేశాలకి ఉండే తేడా,” అని ఉద్ధవ్ థాకరే చురకలు వేశారు. అది మోహన్ భగవత్ ను ఉద్దేశ్యించి అన్నవే అయినా జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాదులకు మద్దతునిచ్చే పిడిపితో భాజపా స్నేహం చేస్తునందుకేనని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close