హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో షాక్ ఇచ్చింది. మెట్రో రైలు టికెట్ల ధరలను పెంచుతూ ఎల్ ఎండ్ టీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కనిష్ట ధర రూ. 10 ఉండగా.. గరిష్ట ధర రూ.60 ఉంది. తాజాగా పెంచిన ధరలు అమల్లోకి వస్తే కనిష్ట ధర రూ.12, గరిష్ట ధర రూ.75 పెరగనుంది. ఈ ధరలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని ఎల్ అండ్ టీ వెల్లడించింది.
మెట్రో చార్జీల పెంపు వివరాలు
రెండు కిలో మీటర్ల వరకు 12 రూపాయలు
4కి. మీ నుంచి 6 కి. మీ వరకు రూ.30
6కి. మీ నుంచి 9 కి. మీ వరకు రూ.40
9 కి. మీ నుంచి 12 కి. మీ వరకు రూ.50
12కి. మీ నుంచి 15 వరకు రూ.55
18 కి. మీ నుంచి 21 కి.మీ వరకు రూ.66
21కి. మీ నుంచి 24 కి. మీ వరకు రూ.70
24కి. మీ పైబడి ప్రయాణం చేస్తే రూ.75గా నిర్దేశించింది