బాహుబ‌లి 2 లో మ‌రో హీరోయిన్‌??

బాహుబ‌లి అస‌లే స్టార్ల‌తో నిండిపోయింది. ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌.. అంద‌రూ స్టార్‌లే. స్టార్ల‌కు స్టారు… మ‌న రాజ‌మౌళి. ఇప్పుడు ఈసినిమాలో మ‌రో స్థార్ క‌థానాయిక‌కు చోటు ద‌క్కింద‌న్న‌ది లేటెస్ట్ టాక్‌. ఆమె ఎవ‌రో కాదు.. ఢిల్లీ డాల్ శ్రియ‌. బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ కోసం శ్రియ‌ని ఎంచుకొన్నార‌ని తెలుస్తోంది. రానా ప‌క్క‌న క‌థానాయిక‌గా శ్రియ క‌నిపించ‌బోతోంద‌ట‌. రానా – శ్రియ‌ల‌కు ఇటీవ‌లే ప్ర‌త్యేకంగా ఓ ఫొటో షూట్ కూడా నిర్వ‌హించార‌ని టాక్‌. రానా ప‌క్క‌న శ్రియ స‌రిగ్గా స‌రిపోయింద‌ని, అందుకే శ్రియ‌ని ఫిక్స్ చేశార‌ని చెప్పుకొంటున్నారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. అతి త్వ‌ర‌లోనే శ్రియ కూడా బాహుబ‌లి టీమ్‌తో జాయిన్ అవుతోంద‌ట‌. అస‌లే స‌రైన అవ‌కాశాలు లేక డీలా ప‌డిన శ్రియ‌కు ఇది అసలు సిస‌లైన గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మ‌రి ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ని శ్రియ ఎంత వ‌ర‌కూ క్యాష్ చేసుకొంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close