చిరుతో పాట‌.. మ‌ళ్లీ ఆ త‌ప్పు చేయ‌నంటున్న శ్రుతి

శ్రుతి హాస‌న్ జాక్ పాట్ కొట్టేసింది. వ‌రుస‌గా చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాల్లో క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకొంది. రెండు సినిమాలూ ఈ సంక్రాంతికే విడుద‌ల అవుతున్నాయి. ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాలూ.. రెండూ ఇంచుమించు ఒకేసారి విడుదల అవ్వ‌డం, రెండింటోనూ శ్రుతినే క‌థానాయిక కావ‌డం… నిజంగా విశేష‌మే. ఈ రెండు సినిమాల‌పైనా శ్రుతి చాలా ఆశ‌లు పెట్టుకొంది. త‌ప్ప‌కుండా ఈ రెండు సినిమాలూ హిట్ట‌వుతాయ‌ని అంటోంది. వాల్తేరు వీర‌య్య‌లో.. చిరుతో క‌లిసి స్టెప్పులేసింది శ్రుతి. ఇందులో ‘చిరంజీవి – శ్రీదేవి’ పాట సూప‌ర్ హిట్ట‌య్యింది. ఈ పాట‌ని పారిస్‌లో తీశారు. మైన‌స్ 8 డిగ్రీల ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఈ పాట‌ని తెర‌కెక్కించారు. ఈ పాట చూడ్డానికి బాగున్నా చేయ‌డానికి చాలా ఇబ్బంది ప‌డాల్సివ‌చ్చింద‌ని అంటోంది శ్రుతి.అంత చ‌లిలో.. చీర క‌ట్టుకొని పాట‌కు డాన్స్ చేయ‌డం సుల‌భ‌మైన విష‌యం కాద‌ని, పాట బాగున్నా.. సెట్లో ఎంజాయ్ చేయ‌లేక‌పోయాయ‌ని, మ‌ళ్లీ అలాంటి త‌ప్పు జీవితంలో చేయ‌న‌ని చెప్పుకొచ్చింది శ్రుతి హాస‌న్‌.

“ఇలాంటి పాటల్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డుతున్నారు. కాక‌పోతే… తెర‌కెక్కించ‌డం మాత్రం చాలా క‌ష్టం. అంత‌టి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో స్టెప్పులేయ‌డం అవ‌స‌రమా అనిపించింది? ఇంకెప్పుడూ ఇలాంటి వాతావ‌ర‌ణంలో ప‌నిచేయ‌ను..“ అంటోంది. చిరుతో చేసిన వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య‌తో చేసిన వీర సింహారెడ్డి రెండూ… సూప‌ర్ హిట్ అవుతాయ‌న్న ధీమా వ్య‌క్తం చేసింది. “ఇద్ద‌రు పెద్ద హీరోల‌తో ఒకేసారి ప‌నిచేయ‌డం గొప్ప అనుభ‌వం. ఈ సినిమాల కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. త‌ప్ప‌కుండా మంచి ఫ‌లితం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌“న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close