యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి వచ్చారు. అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయమని స్క్రిప్టులు పంపుతున్నారు. వారి నియోజకవర్గాలకూ పంపుతున్నారు. అక్కడ సమావేశాలు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. శ్యామలకు ఇంకా జగన్ రెడ్డి రాజకీయం అర్థం కాలేదని.. కొడాలి నాని నుంచి కొమ్మినేని వరకూ అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడి ఏ స్థితిలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని సలహాలిస్తున్నారు.
వైసీపీలో జగన్ రెడ్డి మానసిక ఆనందం .. ఇతర నేతల్ని బలి చేసి .. వారి కి ఓదార్పుయాత్రలు చేసి తాము రాజకీయంగా బలపడాలనుకుంటారు. చాలా కాలంగా ఇదే జరుగుతోంది. ఎంతో మంది నేతలు ఇలాగే .. శంకరగిరి మాన్యాలకు పట్టిపోయారు. ఇప్పుడు కొత్తగా శ్యామల వచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్పై పీఠాధిపతి అని.. మరొకటి అని వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి చెప్పినట్లుగా మాట్లాడి భయంతో వణికిపోతున్న వారిని చూసి కూడా శ్యామలకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తోంది.
గతంలో యాక్టర్ ఫృద్ధ్వీ, అలీ సహా ఎంతో మంది జగన్ రెడ్డి కోసం వచ్చిన స్క్రిప్టులను బట్టి చిన్నా,పెద్ద లేకండా మాట్లాడారు. ఇప్పుడు వారంతా.. ఎటు పోయారో శ్యామల గుర్తు చేసుకుంటే.. పద్దతిగల రాజకీయాలు చేస్తారన్న కామెంట్లు వినిపిస్తున్నారు. సజ్జల ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్టులు ఖచ్చితంగా ఘోరంగా ఉంటాయి. వాటిని ఫాలో అయిపోతే రేపు సజ్జల కూడా పట్టించుకోరు. దానికి పోసానే సాక్ష్యమని వైసీపీ నేతల్లోనే చాలా మంది గుర్తు చేస్తున్నారు.