అప్పుడు కాదు…లాక్‌డౌన్‌లోనే రథం సింహాల చోరీ..!

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వెండి రథానికి ఉన్న రథాలు ఈ ఏడాది మార్చి తర్వాతనే చోరీ అయ్యాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఆలయ అధికారులకూ ఈ విషయంపై స్పష్టత ఉంది. కానీ.. రాజకీయం కోసం తప్పదన్నట్లుగా గత ఏడాది ఉగాది ముగిసిన తర్వాత రథానికి పట్టా కట్టేసి ఉంచామని.. తెరిచి చూస్తే.. వెండి విగ్రహాలు లేవని ఫిర్యాదు చేశారు. కానీ అసలు విషయం మాత్రం పోలీసులకు చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ఉగాది ఉత్సవాల కోసం.. రథాన్ని సిద్ధం చేయాలనుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉత్సవాలు నిర్వహించకపోయినప్పటికీ.. రధానికి మెరుగులుపట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఓ సంస్థకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఆ సంస్థ మరో వ్యక్తికి పని అప్పగించింది. ఇప్పుడా వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు తంటాలు పడుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో రధానికి మెరుగులు పట్టించినట్లుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ విగ్రహాలు.. తమ హయాంలో పోయాయంటే… ప్రజలు అనుమానాలు భరించలేమనుకున్నారో.. ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేమనుకున్నారో కానీ.. మంత్రి వెల్లంపల్లి మొదటగా… ఆ విగ్రహాలు టీడీపీ హయాంలోనే పోయాయని ప్రకటించారు. దానికి తగ్గట్లుగా ఆలయ, ఈవో చైర్మన్‌లు రకరకాల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఈవో అయితే.. అసలు రథానికి నాలుగు సింహాల ప్రతిమలున్నాయా..? రెండే ఉన్నాయా..? అసలు అవి వెండివేనా..?.. స్టోర్ రూమ్‌లో ఉండి ఉంటాయని.. రకరకాలుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో మాత్రం.. తప్పు ఎప్పుడు జరిగిందో.. ఎక్కడ జరిగిందో ఓ క్లారిటీకి వస్తున్నారు.

పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా కొండపై ఆలయ అభివృద్ధి పనులు కొన్ని జరిగాయి. ఆ పనులు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. వారు కొండపైనే ఉండి పనులు చేశారు. పదిహేు రోజుల కిందట వెళ్లిపోయారు. వారిలో ఎవరైనా తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు పోలీసుల్లో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే.. నాలుగో సింహపు ప్రతిమను కూడా తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ అది వెల్డింగ్ చేసి అతికించడంతో తీయడం సాధ్యం కాలేదు. తీయడానికి ప్రయత్నించి పెద్ద కన్నం పెట్టిన విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చోరీ చేసిన మూడు సింహాల ప్రతిమలు మాత్రం బోల్టులతో బిగించారు. అవి సులువుగా రావడంతో తీసుకెళ్లిపోయారు.

రాజకీయంగా వైసీపీ నేతలు… గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా.. అదంతా కేవలం గందరగోళం రేపడానికేనని తాజా పరిణామాలు స్పష్టమవుతున్నాయి. లాక్‌డౌన్ విధించిన తర్వాతనే… కొండపైన ఉండేవారు.. మాత్రమే.. ఈ సింహాలను దొంగతనం చేయడం సాధ్యమని గుర్తించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఆలయ అధికారులు సహకరించడానికి తటపటాయిస్తూండటంతో పోలీసులకు కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close