రజనీ సేఫ్..సింగారావు ఔట్..! టీవీ9లో కిస్సా కుర్సీకా..!

తెలుగులో నిన్నామొన్నటిదాకా నెంబర్ వన్ చానల్‌గా ఉన్న టీవీ9లో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కొత్త యాజమాన్యం ప్రతినిధిగా మొత్తం వ్యవహారం చక్కబెట్టడానికి చానల్‌లోకి వచ్చిన సింగారావు దెబ్బకు… రవిప్రకాష్ తర్వాత అంతా తానే అన్నట్లుగా వ్యవహరించిన రజనీకాంత్ బయటకు వెళ్లిపోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా సిద్ధమయింది. కానీ చివరి క్షణంలో అనూహ్యంగా మేనేజ్‌మెంజ్‌లోని ఓ వర్గం బలమైన మద్దతుతో రజనీకాంత్ మళ్లీ పట్టు సాధించారు.

ఇప్పుడు సింగారావునే బయటకు పంపేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టెన్ టీవీవ్యవహారాలను చూసుకుంటున్న సింగారావుకు కొత్త యాజమాన్యం టీవీ9 బాధ్యతలు కూడా ఇచ్చింది. యాజమాన్యానికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో సింగారావు చెప్పినట్లే నడుస్తూ వస్తోంది. ఈ క్రమంలో రజనీకాంత్ కు ఆయనకు మధ్య విబేధాలు వచ్చాయి. కొద్దికొద్దిగా రజనీకాంత్ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ పోయారు. చివరికి ఈ పరిస్థితి రజనీకాంత్ ఎగ్జిట్‌కు కారణం అవుతుందని అనుకున్నారు. ఆయన వెళ్లిపోవడం దాదాపు ఖాయం అయిన తర్వాత పరిస్థితులు మారాయి.

రజనీకాంత్ ను దూరం చేసుకోవడం కన్నా… సింగారావును దూరం పెట్టడం మంచిదనుకున్నారు కొత్త యాజమాన్యం. ఇప్పటికే రేటింగ్స్‌లో నెంబర్ టూకి చానల్ పడిపోయింది. ఒక్క సారి పతనం ప్రారంభమయితే..ఆపడం ఎవరి తరం కాదు. మొత్తానికి రవిప్రకాష్ ఎపిసోడ్ దగ్గర్నుంచి టీవీ9లో వచ్చేవార్తలకన్నా ఇతర కారణాలతోనే టీవీ9నే మీడియా సర్కిల్స్‌లో హైలెట్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close