జర్సీ రిజల్ట్ కోసం `సీత` వెయిటింగ్…

సమ్మర్ వేడి.. టాలీవుడ్ లో బాగానే కనిపిస్తోంది. సినిమాల ఫలితం ఎలా వున్నా… వారానికి ఓ కొత్త సినిమా వచ్చేస్తోంది. వారమంతా ఆ సినిమా కబుర్లే నడుస్తున్నాయి. మజిలీ, చిత్రలహరి ఆల్రెడీ వచ్చేశాయి. తరువాతి వారం.. జెర్సీ, కాంచన 3 విడుదలకు సిద్ధమవుతున్నాయి. 24న `సీత` రాబోతోంది. అయితే ఇప్పుడు సీత వచ్చేదీ రానిది.. వచ్చేవారం సినిమాల రిజల్ట్ పై ఆధారపడి వుంది.

తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `సీత`. కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా నటించారు. 24న విడుదల అవ్వాల్సిన సినిమా ఇది. అయితే ఇంత వరకూ ప్రమోషన్లు మొదలవ్వలేదు. ఓ టీజర్ ని వదిలారంతే. పాటల్లో ఒక్కటి కూడా బయటకు రాలేదు. అసలు ఈ సినిమాని 24న విడుదల చేయాలా? వద్దా? అనే మీమాంశలో టీమ్ ఉన్నట్టు టాక్. మజిలీ హిట్టయి మంచి వసూళ్లు వస్తున్నాయి. దానికి తోడు చిత్రలహరి వచ్చింది. జెర్సీ విడుదలై మంచి టాక్ వస్తే గనుక.. ఈ మూడూ వసూళ్లను పంచుకుంటాయి. కాంచన 3కి మాస్ లో గిరాకీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాల మధ్య `సీత`ని వదలడం తేజకు ఇష్టం లేదు. కాస్త లేట్ గా అయినా ఫర్వాలేదు, మంచి డేట్ చూసుకుందామని తేజ భావిస్తున్నాడట. ఒక వేళ జెర్సీ, కాంచన 3 ఫలితాలు అటూ ఇటూ అయితే.. అప్పుడు సీత రావడానికి ఎలాంటి అభ్యంతరాలు వుండవు. అంటే సీత వస్తుందా? రాదా? అనేది తేలాలంటే .. జెర్సీ బొమ్మ పడాల్సిందే అన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close