కరెంట్ తీగలకు మరో 6 ప్రాణాలు – పాపం ఉడుతదా? పక్షిదా ?

జూన్‌లో సత్యసాయి జిల్లాలో ఆటోపై కరెంట్ తీగలు పడి ఐదుగురు సజీవ దహనం అయిన ఘటన ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే ఆ తీగలు తెగిపడటానికి కారణం ఉడుత అని తేల్చి.. దానికి పోస్టుమార్టం కూడా చేశారు ఘనత వహించిన ప్రభుత్వ నిపుణులు. అది చర్చల్లో ఉండగానే మరోసారి అదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరోసారి కరెంట్ తీగలు తెగిపడి.. ఈ సారి ఆరుగురు చనిపోయారు. ట్రాక్టర్ పై పడటంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. అప్పుడూ.. ఇప్పుడూ చనిపోయింది వ్యవసాయ కూలీలే.

బొమ్మనహాళ్ మండలం.. దర్గాహోన్నూరు దగ్గర ట్రాక్టర్‌పై కరెంట్ తీగలు తెగి పడటంతో ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వ్యవసాయ కూలీలు. సమీపంలో మొక్కజొన్న పంట కోతకు వెళ్తూండగా ఈ ఘటన జరిగింది. బాధితులందరూ.. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వారు. కరెంట్ తీగలు ఎలా తెగిపడ్డాయన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే.. గతంలో జరిగిన ప్రమాదం అందరికీ గుర్తొచ్చింది.

హైటెన్షన్ వైర్లు తెగిపడాలంటే.. చాలా పెద్ద ప్రమాదం జరగాలి. కేవలం షార్ట్ సర్క్యూట్ అయితేనో.. మరొకటో అయితే తెగి పడవు. ఇంకా విషయం ఏమిటంటే.. ఇలా ఉడుతలు.. పక్షుల వల్ల అయితే.. ముందుగా విద్యుత్ లైన్ ట్రిప్ అయి సరఫరా ఆగిపోతుంది. కానీ ఇక్కడ అలాంటివేమీ జరగడం లేదు. వైర్లలో కరెంట్ ప్రవహిస్తోంది. అంటే.. వైర్లే తెగిపడుతున్నాయని స్పష్టంగాతెలుస్తోంది. కానీ విద్యుత్ తీగల కాంట్రాక్టులను.. తీసుకుని నాసి రకం తీగలను సరఫరా చేసిన పెద్దల గుట్టు బయటపడకుండా.. ఉడుతలు.. పక్షలను బలి చేసి.. సైలెంట్ అయిపోతూంటుంది ప్రభుత్వం. కానీ ప్రజల ప్రాణాలు మాత్రం ఎప్పటికప్పుడు పోతూనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close