బెంగాల్ పోలీసులు శర్మిష్ఠ పనోలి అనే లా స్టూడెంట్ ను అరెస్టు చేసిన వ్యవహారం అంతర్జాతీయ విషయంగా మారుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆమె పాకిస్తాన్ గురించి, మహ్మద్ ప్రవక్త గురించి అనుచితమైన వ్యాఖ్యలతో కూడిన పోస్టు పెట్టారని బెంగాల్ లో కేసులు నమోదయ్యాయి. బెంగాల్ పోలీసులు శర్మిష్ఠను గుర్గావ్ నుంచి అరెస్టు చేసి బెంగాల్ కోర్టులో హాజరు పరిచారు.
శర్మిష్ఠ పనోలి పూణె లా యూనివర్సిటీలో లా విద్యార్థిని. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపుగా రెండు లక్షల మంది ఫాలోవర్లు ఆమె అకౌంట్ కు ఉన్నారు. సామాజిక-రాజకీయ అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. అయితే ఆమె భాష అభ్యంతరకరంగా ఉంటుంది. అందుకే కొంత మంది వ్యతికేరిస్తూంటారు. మరికొంతమందిలో సమర్థిస్తూంటారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో బాలీవుడ్ నటులు ఆపరేషన్ సిందూర్పై మౌనంగా ఉన్నారని విమర్శిస్తూ వీడియో చేశారు. ణవీర్ అల్లాబాదియాపై అవమానకర భాషను ఉపయోగించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులోనే ఇస్లాం, ప్రవక్తపై వ్యాఖ్యలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ వీడియో వైరల్ అయ్యి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలువచ్చాయి. అరెస్ట్ శర్మిష్ఠ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. మే 15న కోల్కతాలోని గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. అరెస్టు చేసి అలీపూర్ కోర్టులో హాజరుపరచారు. బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు రిమాండ్ కు పంపింది. పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె తప్పించుకుందన్న అరెస్టు వారెంట్ జారీ అయిందని ఈ కారణంగా అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.
నిజానికి శర్మిష్ఠ తన వీడియో పోస్టు చేసిన తర్వాత రోజే క్షమాపణ చెప్పి ఆ వీడియోను డిలీట్ చేసింది. అవమానకరమైన భాష వాడినప్పటికీ ఆమె క్షమాపణ చెప్పిందని వేధించడం మంచిది కాదని కంగనా రనౌత్ మద్దతు పలికారు. విదేశాల్లోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. డచ్ ఎంపీ గీర్ట్ విల్డర్స్ శర్మిష్ఠ అరెస్టును స్వేచ్ఛాయుత వ్యక్తీకరణకు అవమానంగా పేర్కొన్నాడు, ప్రధాని మోదీని ఆమె హక్కులను కాపాడమని కోరాడు. సోషల్ మీడియాలో శర్మిష్ఠకు మద్దుతో వెల్లువెత్తుతోంది.