తలసాని రాజీనామాని ఆమోదిస్తారా? ఎప్పుడు?

తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తెదేపా నేతల ఒత్తిడికి తలొగ్గి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజినామాపై రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొనేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికల ముందు తెరాస ప్రభుత్వం అటువంటి రిస్క్ తీసుకొంటుందని భావించలేము. తన సనత్ నగర్ నియోజక వర్గం నుండి తనను ఎవరూ కూడా ఓడించలేరని తలసాని బల్ల గుద్ది వాదిస్తున్నప్పటికీ ఒకవేళ ఆయన ప్రతిపక్షాల చేతిలో ఓడిపోయినట్లయితే ఆ ప్రభావం తప్పకుండా జి.హెచ్.యం.సి. ఎన్నికలపై పడవచ్చును. తమ పార్టీ నేతలను, ప్రజా ప్రతినిధులను తెరాసలోకి ఆకర్షిస్తూ తమను నానాటికీ బలహీనపరుస్తున్నందుకు, కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు తలసాని రాజీనామా కారణంగా జరుగబోయే ఈ ఉప ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం కోసం హోరాహోరీగా పోరాడవచ్చును. తెరాసను ఓడించేందుకు అవసరమయితే ఆ మూడు పార్టీలు లోపాయికారిగా ఒకదానికొకటి సహకరించుకొన్నా ఆశ్చర్యం లేదు.

కనుక స్పీకర్ మధుసూదనాచారి తెదేపా నేతలకి మాట ఇచ్చినప్పటికీ దానిని ఇప్పుడప్పుడే అమలు చేస్తారని ఆశించలేము. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే నిర్వహించే సూచనలేవీ కనబడటం లేదు. ఈ ఏడాది డిశంబర్ 15 వరకు తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు గడువు ఇచ్చింది. అవసరమయితే మరికొన్ని నెలలు పొడిగించేందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచన కూడా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇదివరకు ఒకసారి మీడియాతో అన్నట్లు వార్తలు వచ్చేయి. అంటే అంతవరకు తలసాని రాజీనామా సీరియల్ కూడా కొనసాగుతూనే ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్ర‌మంత్రిగా ఈట‌ల రాజేంద‌ర్… బీజేపీ అగ్రనేత జోస్యం!

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ కేంద్ర‌మంత్రి కాబోతున్నారా...? మ‌ల్కాజ్ గిరి దీవించి పంపితే జ‌రిగేది అదే అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు కేంద్ర‌మంత్రి. మల్కాజ్ గిరిలో ఈట‌ల గెలిస్తే కేంద్ర‌మంత్రి అవుతారు అంటూ...

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close