అయోధ్య రామ్ మందిర్ : హిందువుల కల నెలవేర్చిన మోదీ

పదేళ్ల కిందట కాదు.. ఐదేళ్ల కిందట బీజేపీ రెండో సారి గెలిచిన తర్వాత కూడా అయోధ్య రామ మందిరం ఇష్యూకి ముగింపు లభిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే సమస్య అలాంటిది. రాజకీయంగా సున్నితమైనది. ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నా రాజకీయపార్టీలు అంగీకరిచబోవని అలా వివాదం చేస్తూ ఉంటేనే వాటికి మనుగడ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉండేవారు. కానీ ప్రధాని మోదీ చాకచక్యంగా సమస్యను పరిష్కరించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రారంభిస్తున్నారు. ఇదంతా నిస్సందేహంగా మోదీ ఘనతే.

అయోధ్య అలయ నిర్మాణం మోదీ సంకల్పం

32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ అయోధ్యని సందర్శించారు. రామ్ లల్లా అప్పటికి ఓ టెంట్‌లో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చాలా సేపు తదేకంగా చూశారట మోదీ. ఆ సమయంలో “రాముడికి గుడి కట్టిన తరవాతే ఈ నేలపై అడుగు పెడతాను” అని ప్రతిజ్ఞ చేసుకున్నారట. అలా తన 30 ఏళ్ల పంతాన్ని నెగ్గించుకుని జనవరి 22న జరగనున్న అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కానున్నారు నరేంద్ర మోదీ. కేవలం ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకునేందుకే దేవుడు తనకీ జన్మనిచ్చాడేమో అంటూ మొన్నామధ్య భావోద్వేగానికి లోనయ్యారు. తనను తాను హిందూవాదిగా ఎప్పుడూ చెప్పుకోకపోయినప్పటికీ…ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మోదీనే తమ ప్రతినిధిగా భావిస్తున్నారు.

అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం

అయోధ్య సమస్య దేశం మొత్తం అట్టుడికిపోవడానికి కారణమైన సమస్య. ఎలాంటి వివాదాలు లేకుండా. ఎవరికీ అసంతృప్తి లేకుండా పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అయింది. సుప్రీకోర్టు తీర్పును అందరూ అంగీకరించారు. చారిత్రక ఆధారాలను బట్టి తీర్పు ఇచ్చారు. ముస్లిం వర్గానికీ అన్యాయం జరగకుండా స్థలం ఇచ్చారు. దీంతో అందరూ సంతృప్తి చెందారు. పట్టి పీడించిన ఓ సమస్యకు పరిష్కారం లభించడ మే కాదు.. దేశ హిందువుల కలను నెరవేరుస్తున్నారు.

బీజేపీ మార్క్ హిందూత్వాన్ని ఆమోదయోగ్యంగా మార్చిన మోదీ

ఎవరేమనుకున్నా మోదీ హిందూత్వ వాదినే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల రూపురేఖలు మార్చేయడం. అందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం. అన్నింటి కన్నా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రత్యేక చొరవ చూపించడం. ఇవే ప్రధాని మోదీ ఆదరణను అమాంతం పెంచింది. “మోదీ హయాంలో అయోధ్య రాముడి గుడి కట్టారు” అని వచ్చే తరాలు చెప్పుకుంటాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తమ ఎజెండాగా చెప్పే బీజేపీకి పొలిటికల్‌గానే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఇది చరిష్మాని పెంచే కీలక పరిణామం ఇది. అయోధ్య ఆలయాన్నీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఘనంగా ఈ వేడుకని నిర్వహించేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close