యోగాంధ్రకు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ ఫేక్ ప్రచారం ప్రారంభించింది. అసలు మూడు వందల కోట్లు అని ఎలా చెబుతున్నారు.. దానికేమైనా జీవో లేదా అధికారులు వేసిన అంచనాలు ఉన్నాయా .. అంటే అదేమీ లేదు. అసలు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా అలా ప్రచారం చేసేస్తున్నారు. యోగాంధ్ర కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టి ఖర్చు రూ. 75 కోట్ల రూపాయలు. ఇది కూడా పూర్తిగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రీఎంబర్స్ చేస్తుంది. అంటే అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు జీరో.
కానీ వైసీపీ ఫేక్ ప్రచారం మాత్రం మూడు వందల కోట్లకు చేరిపోయింది. అడ్డగోలుగా .. ఆరు వందల కోట్లు పెట్టి రుషికొండప్యాలెస్ కట్టి అంతకు ముందు అక్కడ ఉన్న రెండువందల కోట్ల ఆస్తిని నేలమట్టం చేసిన నిర్వాకం కళ్ల ముందే ఉన్నా..ఇలాంటి అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు. లెట్రిన్ కమోడ్కు లక్షలు పెట్టిన అధనేత చేసింది గొప్ప అని చెప్పుకోవడానికి జరగని ప్రచారాన్ని జరగనట్లుగా చేస్తున్నారు.
రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు.. తప్పుడు ప్రచారాలు చేయడం మాత్రం మానబోమన్నట్లుగా వీరి తీరు ఉంది. ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తే.. ప్రశ్నించడంలో అర్థం ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసి.. ప్రజల మనసుల్లో విషం నింపాలుకుంటే.. నిజం నిలకడ మీద తెలుస్తుంది. వైసీపీ ఫేక్ ప్రచారాలు అలాంటివే. ఎప్పుడైనా వైసీపై నిజం చెప్పినా నమ్మనంత ఘోరంగా వారి పై ఫేక్ ముద్ర పడిపోయింది. అయినా మారడం లేదు.