శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇచ్చేసిన సర్కార్..!

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నిందితురాలయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి … జగన్మోహన్ రెడ్డి సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేసుల కారణంగా ఇంత కాలం నిలిచిపోయిన ప్రమోషన్లను కల్పించింది. ఇప్పటి వరకూ ఆమె కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఏపీకి వచ్చి గట్టిగా నెల కాకుండానే.. కార్యదర్శి ర్యాంక్‌ నుంచి ముఖ్యకార్యదర్శిగా ప్రమోషన్ ఇస్తూ… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసింది. విశేషం ఏమిటంటే.. ఆదిత్యనాథ్ దాస్ కూడా.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో పేరు ఉన్న వారే. అయితే.. శ్రీలక్ష్మికి ప్రమోషన్ ఇవ్వడం చెల్లుతుందా అనే సందేహం ఉంది. అందుకే.. ఆదిత్యనాథ్ దాస్.. ఈ ప్రమోషన్ ఉత్తర్వుల్లోనే…డిస్‌క్లెయిమర్ కూడా చేర్చారు. శ్రీలక్ష్మి మీదున్న పెండింగ్‌ కేసుల తీర్పులు, డీవోపీటీ నిర్ణయం మేరకు అమలు జరుగుంతుందని.. తుదితీర్పులకు లోబడే ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని వివరణ ఇచ్చారు.

అంటే… సీఎస్ ఈ విషయంలో తనపై ఎలాంటి నింద పడకుండా జాగ్రత్త పడ్డారన్న మాట. అతి చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన శ్రీలక్ష్మి… జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కోకుండా ఉండి ఉంటే… చీఫ్ సెక్రటరీ అవడానికి అవకాశం ఉండేది. అదీ కూడా చాలా ఎక్కువ కాలం ఆమె సీఎస్ హోదాలో ఉండేవారు. కానీ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న తర్వాత జైలు పాలయ్యారు. బెయిల్ వచ్చిన తర్వాత పోస్టింగ్.. ఆ తర్వాత కేసుల కారణంగా ఆమె లూప్ లైన్‌లోనే ఉండిపోయారు. తెలంగాణ సర్కార్ ఆమెను ప్రాధాన్యతా పోస్టులు కల్పించలేదు. జగన్ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆమెకు ఉత్సాహం వచ్చినట్లయింది.

ఏడాదిన్నర పాటు తెలంగాణలో విధులకు వెళ్లకుండా… కష్టపడి.. క్యాడర్ మార్పించుకుని ఏపీకి వచ్చారు. రాగానే ప్రమోషన్ ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. అయితే ఆ కేసులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయని… ఆదిత్యనాథ్ దాస్..తన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పారు. అయితే సహ నిందితులందరికీ జగన్ ఇలా మేళ్లు చేయడం… తర్వాత ఇబ్బందికరం అవుతుందన్న చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close