పాక్ తో చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: భారత్

భారత్-పాక్ మధ్య ఏర్పడిన సానుకూల వాతావరణం పఠాన్ కోట్ దాడితో ఆవిరయిపోయింది. ఇరు దేశాలు ఇంకా చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఒకరకంయియన్ స్తబ్దత, గంభీరమయిన వాతావరణం నెలకొని ఉన్నాయి. పఠాన్ కోట్ దాడికి కుట్రపన్నిన వారిపై పాక్ ప్రభుత్వం ఇంతవరకు గట్టి చర్యలు ఏవీ తీసుకోకపోవడంతో భారత్ ఆగ్రహంగా ఉందనే విషయం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తాజా ప్రకటనలో వ్యక్తమయింది.

భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఫిబ్రవరి మొదటివారంలో జరుగవచ్చని పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పగానే దానిని వికాస్ స్వరూప్ వెంటనే ఖండించారు. దానిపై ఇరుదేశాలు ఇంతవరకు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని ప్రకటించారు. “పఠాన్ కోట్ దాడికి సంబంధించి పాకిస్తాన్ తో మేము రోజూ మాట్లాడుతూనే ఉన్నాము,” అని తెలిపారు కానీ ఆ వివరాలను తెలపడానికి నిరాకరించారు. త్వరలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగవచ్చని తెలిపారు. ఆ సమావేశంలో ప్రధానంగా పఠాన్ కోట్ పై జరిగిన దాడి గురించే చర్చించాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు.

పఠాన్ కోట్ పై దాడి జరిగి అప్పుడే దాదాపు నెల రోజులు పూర్తయింది. ఇలాగే మరొక రెండు మూడు నెలలు దీనిని పాక్ సాగదీయగలిగితే క్రమంగా దానిపై ఒత్తిడి కూడా తగ్గిపోవచ్చును. మళ్ళీ అటువంటి ఘటన ఏదో జరిగినప్పుడు మళ్ళీ ఇలాగే హడావుడి చేయడం తప్పించి ఇక భారత్ చేయగలిగిందేమీ ఉండక పోవచ్చును. ఇదే కనుక జరిగితే అది భారత్ దౌత్య వైఫల్యమే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close