విద్యార్థిని ఆత్మహత్య : అందరికీ మోహన్‌బాబే గుర్తొస్తున్నారు..!

ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం. తండ్రి ఫీజు కట్టడం కోసం ఐదు రూపాయలు.. పది రూపాయల వడ్డీకి తెచ్చి వారితో మాటలు పడటం చూడలేక.. తానే భారమయ్యాయనని ప్రాణం తీసుకుంది. ఈ ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనాత్మకం అవుతోంది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించడం లేదు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన కొద్ది బకాయిల్ని చెల్లించిన తర్వాత.. ఇక నుంచి కాలేజీలకు రీఎంబర్స్ మెంట్ లేదని.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ వేసిన పాపాన పోలేదు. దీంతో కాలేజీలన్నీ విద్యార్థుల వద్ద ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి.

తేజశ్రీ ఆత్మహత్యపై ముందుగా చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏమైంది?.. నాడు- నేడు అంటూ కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించమని.. కాలేజీ యాజమాన్యాలు చెబుతుంటే విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు.. పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలోనూ తేజశ్రీ ఆత్మహత్య అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అందరూ మోహన్ బాబునే గుర్తు చేసుకుంటున్నారు.

గత ఎన్నికలకు ముందు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వడం లేదని… ఆయన తన కాలేజీ విద్యార్థుల్ని తీసుకుని రోడ్డుపై పడుకుని ప్రదర్శన చేశారు. నిజానికి అప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్‌గా చెల్లిస్తోందని..ఆ త్రైమాసికానికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ నడుస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయినా ఆయన ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఆందోళన చేశారు. చేయాల్సిన ఆరోపణలు చేశారు. తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమీ మాట్లాడటం లేదు. ఓ ఇంటర్యూలో ఇప్పుడూ తనకు ఫీజు రీఎంబర్స్ మెంట్ రావడం లేదని… ఆస్తులు తాకట్టు పెట్టుకున్నానని బాధపడ్డారు. కానీ ఆయనకు రావాల్సిన ప్రయోజనం వచ్చి ఉంటుంది కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారని.. ఇతర కాలేజీల గురించి ఎందుకు పట్టించుకోరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించాల్సింది మోహన్ బాబే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close