‘ఛ‌త్ర‌ప‌తి’ రీమేక్‌కి నో చెప్పిన ద‌ర్శ‌కుడు

సాహో త‌ర‌వాత‌.. సుజిత్ ఖాళీగానే ఉన్నాడు. లూసీఫ‌ర్ రీమేక్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మ‌రో రీమేక్ త‌న‌ని వెదుక్కుంటూ వెళ్లింది. అయితే దానికి తన‌కు తాను `నో` చెప్పేశాడు.

ప్ర‌భాస్ – రాజ‌మౌళిల ఛ‌త్ర‌ప‌తి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరో. ఈసినిమాకి ఓ సౌత్ ఇండియ‌న్ ద‌ర్శ‌కుడినే తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చ‌ర్చించిన పేరు… సుజిత్. తాను తీసిన సాహో ద‌క్షిణాదిన పెద్ద‌గా ఆడ‌క‌పోయినా… నార్త్ లో మంచి వ‌సూళ్లు అందుకుంది. అందుకే సుజిత్ ని సంప్ర‌దించారు. అయితే సుజిత్ ఈ సినిమా రీమేక్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. పైగా యూవీ క్రియేష‌న్స్‌లో సుజిత్ మ‌రో సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్నాడు. సాహో త‌ర‌వాత‌.. యూవీతోనే సినిమా చేయాల‌న్న‌ది ఎగ్రిమెంట్‌. ఓ క‌థ రెడీ చేసి, హీరోని వెదికి ప‌ట్టుకునే ప‌నిలో ఉన్నాడు. అన్నీ కుదిరితే.. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా మొద‌లు కావొచ్చు. `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ కూడా జ‌న‌వ‌రిలోనే ప‌ట్టాలెక్కాలి. అందుకే… సుజిత్ ఈ సినిమాని వ‌దులుకోవాల్సివ‌చ్చింద‌ని టాక్‌. సుజిత్ చేయ‌ని ప‌క్షంలో ప్ర‌భుదేవా, వినాయ‌క్ ల‌ని సంప్ర‌దించాల‌ని నిర్మాత‌లు భావించారు. ఇప్పుడు అదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close