రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. తన తండ్రిపై సీఐడీ అధికారులు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ.. రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఈ ఆదే్శాలు జారీ చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో… వైద్యపరీక్షలను వీడియోగ్రఫీ చేయాలని.. నివేదికను సీల్డ్‌కవర్‌లో ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్యపరీక్షల సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంపీకి వై కేటగిరీ భద్రత కొనసాగించాలని రూలింగ్ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రఘురామకృష్ణరాజును ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రఘురామకృష్ణరాజు మరో వైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైనా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్‌ను ఆదేశిస్తూ.. శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో.. రఘురామకృష్ణరాజు తరపున.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. రఘురామను అరెస్ట్‌ చేసిన తీరును న్యాయస్థానానికి వివరించిన రోహత్గీ.. బెయిల్‌ రాకూడదనే సెక్షన్‌ 124(ఏ) కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. సీఐడీ అదనపు డీజీ స్వయంగా విచారణకు ఆదేశించారని.. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని గుర్తు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. గుంటూరు తీసుకెళ్లాలనే ప్లాన్ చేశారన్నారు. ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే అనే సీనియర్ లాయర్ వాదనలు వినిపించారు. రమేష్ ఆస్పత్రిలో పరీక్షలు వద్దని.. మంగళగిరి ఎయిమ్స్‌లో అభ్యంతరం లేదని ఆయన వాదించారు.

సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్న సమయంలోనూ.. హైకోర్టు ఆదేశాలను పాటించడానికి సీఐడీ ముందుకు రాలేదు. వైద్య పరీక్షల కోసం రమేష్ ఆస్పత్రికి తరలించాలని నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయలేదు. రమేష్ ఆస్పత్రికి తరలించడానికి తమకు అభ్యంతరాలున్నాయని చెప్పినా… వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించిన హైకోర్టు.. ఆదేశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ సీఐడీ అధికారులు హైకోర్టు ఆదేశాలను పాటించడానికి సిద్ధపడలేదు. దీంతో.. సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యతను ఏపీ సీఎస్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close