తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు

మన దేశంలో చాలా రాజకీయ పార్టీలు జాతీయ ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తూ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుంటాయి. ప్రస్తుతం ఊహాజనితమయిన మత అసహనంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాద్ధాంతం ఆ కోవకు చెందినదే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల పట్ల తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ పోటా పోటీగా సానుభూతి చూపడం కూడా ఆ కోవకు చెందినదేనని చెప్పవచ్చును. మన దేశ ప్రధానమంత్రిని అతి దారుణంగా హత్య చేస్తే, అందుకు కారకులయిన వారిని శిక్షించమని కోరకపోగా మరణశిక్ష పడిన వారిని విడిచిపెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు కృషి చేయడం చూసి దేశప్రజలు అందరూ విస్మయానికి గురవుతున్నారు.

ఈ హత్య కేసులో దోషులు అందరూ శ్రీలంకలో తమిళుల కోసం పోరాడిన ఎల్.టి.టి.ఈ. ఉగ్రవాద సంస్థకు చెందినవారు. కనుక వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యవహరించినా రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకు కోల్పోతామనే ఆలోచనతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలు పడిన వారినందరినీ జైలులో నుండి విడుదల చేసేందుకు పోటీలు పడుతున్నాయి. దేశ ప్రధానిని హత్యచేసినవారయినా వారి వలన తమకి లాభం కలుగుతుంది అంటే వారిని సమర్ధించేందుకు తమిళనాడులో రాజకీయ పార్టీలు సిద్దపడటం చాలా సిగ్గు చేటు.

వారి ప్రయత్నాలని సుప్రీం కోర్టు నిర్ద్వందంగా తిప్పికొడుతూ ఈరోజు తీర్పు చెపింది. యావజ్జీవ కారాగార శిక్ష పదిన తొమ్మిది మంది రాజీవ్ గాంధీ హంతకులను తమిళనాడు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టింది, తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. అటువంటి కేసులలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకొనే వీలు లేదని విస్పష్టంగా చెప్పింది. దానిపై కేంద్ర ప్రభుత్వానికి తప్ప మరెవరికీ నిర్ణయం తీసుకొనే హక్కు లేదని తేల్చి చెప్పింది. కేంద్రం అనుమతి లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని, దోషులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి వీలు లేదని వారందరూ తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close