నిర్భయ బాలనేరస్తుడి కోసం అర్దరాత్రి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు

నిర్భయ కేసులో బాల నిందితుడు నిన్న విడుదలయ్యాడు. అతనిని విడుదల చేయవద్దని నిర్భయ తల్లి తండ్రులతో సహా అనేక మంది ప్రజలు, ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అతను చట్ట ప్రకారం తన మూడేళ్ళ శిక్షా కాలం పూర్తి చేసుకొన్నందున అతని శిక్షను పోదిగించలేమని డిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. బాల నేరస్థుడి విడుదల పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున అతని భద్రతను దృష్టిలో ఉంచుకొని, పోలీసులు అతనిని ఒక సచ్చంద సంస్థకు అప్పగించారు. డిల్లీ హైకోర్టు అతని నిర్బంధాన్ని పొడిగించడానికి అంగీకరించకపోవడంతో నిర్భయ తల్లితండ్రులు డిల్లీ మహిళా కమీషన్ ని ఆశ్రయించగా, ఆ సంస్థ చైర్ పర్శన్ స్వాతి నిన్న ఆర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

ఈ కేసు తీవ్రతను, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌, నిన్న అర్ధరాత్రి తరువాత సుమారు ఒంటి గంటన్నరకు జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌లతో అత్యవసరంగా తన నివాసంలోనే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. కానీ జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం కూడా డిల్లీ హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ బాల నేరస్థుడి విడుదలపై స్టే మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే అతనిని విడుదల చేయవద్దని కోరుతూ ఇప్పటికే దాఖలయిన ఒక పిటిషనుని ఈరోజు (సోమవారం) విచారించబోతున్నందున దానిపై తీర్పు నేడో రేపో వెలువరించే అవకాశం ఉంది. పురందేశ్వరి, కవిత వంటి అనేకమంది రాజకీయ మహిళా నేతలు ఆ బాల నేరస్తుడి వలన సమాజానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కనుక మరి కొన్నాళ్ళు అతనిని నిర్బందంలోనే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close