నిర్భయ బాలనేరస్తుడి కోసం అర్దరాత్రి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు

నిర్భయ కేసులో బాల నిందితుడు నిన్న విడుదలయ్యాడు. అతనిని విడుదల చేయవద్దని నిర్భయ తల్లి తండ్రులతో సహా అనేక మంది ప్రజలు, ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, అతను చట్ట ప్రకారం తన మూడేళ్ళ శిక్షా కాలం పూర్తి చేసుకొన్నందున అతని శిక్షను పోదిగించలేమని డిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. బాల నేరస్థుడి విడుదల పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున అతని భద్రతను దృష్టిలో ఉంచుకొని, పోలీసులు అతనిని ఒక సచ్చంద సంస్థకు అప్పగించారు. డిల్లీ హైకోర్టు అతని నిర్బంధాన్ని పొడిగించడానికి అంగీకరించకపోవడంతో నిర్భయ తల్లితండ్రులు డిల్లీ మహిళా కమీషన్ ని ఆశ్రయించగా, ఆ సంస్థ చైర్ పర్శన్ స్వాతి నిన్న ఆర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

ఈ కేసు తీవ్రతను, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌, నిన్న అర్ధరాత్రి తరువాత సుమారు ఒంటి గంటన్నరకు జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌లతో అత్యవసరంగా తన నివాసంలోనే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. కానీ జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం కూడా డిల్లీ హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తూ బాల నేరస్థుడి విడుదలపై స్టే మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే అతనిని విడుదల చేయవద్దని కోరుతూ ఇప్పటికే దాఖలయిన ఒక పిటిషనుని ఈరోజు (సోమవారం) విచారించబోతున్నందున దానిపై తీర్పు నేడో రేపో వెలువరించే అవకాశం ఉంది. పురందేశ్వరి, కవిత వంటి అనేకమంది రాజకీయ మహిళా నేతలు ఆ బాల నేరస్తుడి వలన సమాజానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కనుక మరి కొన్నాళ్ళు అతనిని నిర్బందంలోనే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close